వైసీపీ కీలక నేతల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లింది. చిలకలూరిపేట నుంచి 2019లో గెలిచారు విడదల రజిని. 2024లో రజిని గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దించింది వైసీపీ అధిష్టానం. కొత్త నియోజకవర్గమైన గెలిచేందుకు రజిని అన్ని ప్రయత్నాలు చేశారు. పార్టీ నేతలు అందరినీ కలుపుకొని వెళ్లారు. అయితే రజనీకి ఓటమి తప్పలేదు. దీంతో రజనీ తిరిగి చిలకలూరిపేట నియోజకవర్గానికి వెళ్తారా లేదా గుంటూరు బెస్ట్ లోనే ఉంటారా అనే పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. గుంటూరు వెస్ట్ లోని విడుదల రజిని నివాసం కూడా ఏర్పరచుకుంటున్నారు.


ఓటమి తర్వాత తరచూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వైయస్ జగన్ తో పాటు మాజీ సీఎం తాటికొండ వెళ్లినప్పుడు ఆయన వెంటే ఉన్నారు. అయితే గుంటూరు రెస్ట్ నియోజకవర్గంలో ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతే పూర్తిస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఉన్నారట రజిని. మరోవైపు ఆమెకు గుంటూరు అర్బన్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. 2019లో వేమూరు నుంచి గెలిచిన నేరుగా నాగార్జున మంత్రిగా కూడా పని చేశారు.


మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయనను సొంత అభ్యర్థిగా ప్రకటించారు వైసిపి అధినేత. ఓడిపోయిన తర్వాత సంత నూతన పాడ్ పై ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. వేమూరు నియోజకవర్గంలో పైన ఆసక్తి చూపుతున్నారట. నేరుగా నాగార్జున. అయితే అతనిని బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. మరో ముఖ్య నేత మాజీ హోం మంత్రి సుచరిత పత్తిపాడు నుంచి ఈసారి తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు పార్టీ ఓటమి తర్వాత సుచరిత కూడా ప్రస్తుతం ఎవరికి అందుబాటులో లేరు ఆమె తిరిగి ప్రత్తిపాడుకు వస్తారా లేదా అనే పార్టీ షేర్లు చర్చించుకుంటున్నారు.


వాస్తవానికి ఈసారి పోటీకి సుచరిత ఆసక్తి చూపించడం లేదు. భర్త దయాకర్ కి టికెట్ ఇవ్వాలని సుచరిత కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే అధిష్టానం మాత్రం ఆయన ఆమెను తాడికొండ నుంచి పోటీ చేయించింది. దీంతో సుచరిత భవిష్యత్తు రాజకీయంపై రెండు నియోజకవర్గాల్లో క్యాడర్ చర్చించుకుంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగ్గురు నేతల రాజకీయం ఎక్కడి నుంచి అని ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: