వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన వైసీపీ మహిళా నేత సినీనటి రోజా 2024 ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నుంచి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఘోరమైన ఓటమిని చవిచూసింది. మంచి 2019 నుంచి 2024 జూన్ మూడో వరకు రోజా హవా బాగా పెరిగింది. మొదట మూడేళ్లు ఏపీఐఐసీ చైర్పర్సన్ గా మంత్రిగా పదవిని దక్కించుకుంది. చివరి రెండేళ్లలో పర్యటక, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా కూడా బాగానే పేరు సంపాదించింది వైసీపీ నేత రోజా.



వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించిన ఈమె టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడూ కూడా నిరంతరం ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు కూడా రోజా బాణసంచా కాల్చడంతో పాటు సంబరాలను కూడా అంబరాలు అంటేలా చేసింది. అయితే రోజా ఇటీవలే ఓటమిపాలు కావడంతో ప్రస్తుతం ఆమె ఎక్కడా కనిపించలేదని కేవలం అడపాదడప ప్రెస్ మీట్లతో మాట్లాడడం తప్ప మరెక్కడ కనిపించడం లేదు.


అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం  రోజా అవినీతిపైన దృష్టి సారించారు. ఆమె గతంలో ఈటీవీ జబర్దస్త్ షో తో పాటు పలు చానల్స్ లో కూడా జడ్జిగా వ్యవహరించింది. అయితే ఇటు రాజకీయాలలో అటు వినోద రంగానికి దూరమైన రోజా విదేశాలలో విహరిస్తున్నట్టు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అవి కూడా మోడరన్ దుస్తులలో రోజా ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మోకాళ్లపై వరకు మాత్రమే ఆమె దుస్తులను ధరించి ఒక కాలుకు టాటూ ఉన్నట్లుగా కూడా ఈ ఫోటోలో కనిపిస్తోంది. రోజా తన కూతురు విదేశాలలో చదువుతోంది కనుక ఆమెను కలవడానికి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. కూటమి కార్యకర్తలు మాత్రం ఈ ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: