ఏపీలో మొన్న జరిగిన సాధారణ ఎన్నికలలో వైసిపి ప్రభుత్వం ఓడిపోయింది. అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి నుంచి దిగిపోయారు ... ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఏపీ పోలీస్ శాఖ జగన్కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని ... భద్రత తగ్గించారంటూ ఆయన చెబుతున్న వాదనలు నిజం కాదని వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదుల వాద‌న‌ల ప్ర‌కారం గ‌తంలో ఆయ‌న‌కు  కల్పించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా తనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రయాణించడానికి అనుకూలంగా లేదని జగన్ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే జామర్ వెహికల్ కూడా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం జగన్కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని ?ప్రశ్నించింది.

ఈ సందర్భంగా స్పందించిన అడ్వకేట్ జనరల్... ప్రత్యామ్నాయ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, జామర్ వెహికల్ ఏర్పాటు చేసే విష‌యంలో అధికారుల‌ను వివ‌రాలు అడిగి స‌మ‌ర్పిస్తామ‌ని చెప్పింది. ఇక జ‌గ‌న్ భ‌ద్ర‌త ఈ యేడాది జూన్ 3 కు ముందు వ‌ర‌కు ఎలా ఉందో ? అలాగే పున‌రుద్ధ రించాల‌ని జ‌గ‌న్ కోరుతున్నారు. ఇక ఏపీలో దీనిపై రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక కూట‌మి నేత‌ల వెర్ష‌న్ మ‌రోలా ఉంది. పులివెందుల ఎమ్మెల్యేకి.. సీఎంకి, పీఎం కి ఇచ్చినంత సెక్యూరిటీ ఇవ్వరని కూటమి నేతలు కౌంటర్లు వేస్తున్న నేపథ్యంలోనే హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: