బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా, ఆ తర్వాత దేశం విడిచిపెట్టి పారిపోయారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌ను మొత్తం సైన్యం తన కంట్రోల్‌లోకి తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ అధ్యక్షతన.. రేపు బంగ్లాదేశ్‌లో తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ వెల్లడించారు. మహ్మద్ యూనస్ మంత్రివర్గంలో 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు (గురువారం) ఉదయం 8 గంటలకు మహమ్మద్ యూనస్‌ బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని హసీనా రాజీనామా చేసి భారత్ కి విచ్చేసింది. దీంతో నిన్న పార్లమెంట్ ను కూడా రద్దు చేశారు ప్రెసిడెంట్. రేపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్టు తెలుస్తోంది. గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆర్మీ చీప్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ తెలిపారు.నోబెల్ అవార్డు గ్రహీత డా.మహమ్మద్ యూనుస్ రేపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 15 మంది మంత్రులతో బంగ్లాదేశ్ కొత్త క్యాబినెట్ ఏర్పడనుంది. గురువారం రాత్రి 8 గంటలకు తాత్కాలిక ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలిపారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించాలని మహమ్మద్ యూనుస్(84) ను ఎంపిక చేశారు. 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. 2006లో నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు.ఇక 84 ఏళ్ల మహ్మద్ యూనస్.. 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా పనిచేశారు. అంతేకాకుండా చిట్టగాంగ్‌ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా కూడా సేవలు అందించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్‌లోని పేదల అభ్యున్నతికి మహ్మద్ యూనస్ ఎననలేని కృషి చేశారు. 1940లో చిట్టగాంగ్‌లో పుట్టిన మహ్మద్ యూనస్.. ఒక సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థిక వేత్తగా ఉన్నారు. మైక్రోఫైనాన్స్‌ బ్యాంక్‌ ద్వారా బంగ్లాదేశ్‌లోని లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు.అయితే బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే.. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న ఘర్షణలు ఆగుతాయని సైన్యం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: