* వైసీపీ నుంచి రాలిపోతున్న నేతలు
* కష్టంగా మారిన వైసీపీ భవిష్యత్తు

 

ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ : ఎన్నికల టైం నుంచి కూడా వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కొన్ని రోజుల నుంచి వైసీపీ పార్టీ నుంచి నేతలు వైదొలగడం ప్రారంభించారుఒక్కొక్కరుగా పలువురు నేతలు వేరే పార్టీల గూటికి చేరారు. అంతేగాక ఎన్నికల్లో వైసీపీపైనే పోటీకి కూడా నిలబడ్డారు. ఆ ఎదురు దెబ్బలకు కూడా పెద్దగా పట్టించుకోని వైసీపీకి.. ఎన్నికల్లో ఘోర పరాజయంతో ప్రజలు ఊహించని షాక్ ఇవ్వడం జరిగింది. ఇక అప్పటి నుంచి వైసీపీలో వలసలనేవి ఊపందుకున్నాయి. పేరు మోసిన నేతలు కూడా వైసీపీకి చెక్ పెట్టి టీడీపీ వైపు మల్లుతున్నారు. ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ స్థాయిలోని నేతలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీల్లోకి వచ్చేస్తున్నారు. ఈమధ్య ఈ వలసలు కాస్త తగ్గుముఖం పట్టాయని అన్న భావన కూడా మొదలైంది. అయితే అదేమీ లేదని.. వైసీపీ ఖాళీ అయ్యే దిశగానే అడుగులు వేస్తోందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండెం దొరబాబు తన రాజీనామాతో చెప్పారు.



వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా దొరబాబు రాజీనామా చేయడం జరిగింది. పార్టీలో ప్రాధాన్యత తగ్గడం ఇంకా సరైన గుర్తింపు కూడా ఇవ్వకపోవడం కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంకా అంతేకాకుండా కేవలం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలన్న ఉద్దేశంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చానే తప్ప రాజకీయ లబ్ది కోసం కాదని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రజలకు మంచి జరగాలన్నదే తన కోరిక అని, అది ఎన్‌డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తాను గట్టిగా నమ్ముతున్నానని కూడా ఆయన అన్నారు. ఒక్క ఆయననే కాదు మిగతా నేతలు కూడా వైసీపీని వీడి పోవడానికి రెడి అవుతున్నారు. సరైన గుర్తింపు లేక, అలాగే ఎన్నికల ఓటమితో వైసీపీ జాతకం ఏంటో నేతలకు పూర్తిగా అర్ధం అయ్యింది. అలాగే జనాల్లో కూడా వైసీపీ పై నెగటివ్ భావన ఎక్కువగా ఉంది. కాబట్టి వైసీపీ నేతలు గుడ్ బై చెప్పేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: