కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయిలో తీసుకొనే నిర్ణయాలను అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వల్ల అతి పెద్ద పార్టీగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాల స్థాయిలో నాయకులను సైతం ఎంపిక చేయడం కూడా జరుగుతోంది .ఇప్పటికే దాదాపు అదే పద్ధతిని కూడా కొనసాగుతోంది. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని సైతం క్షేత్రస్థాయికి తీసుకురావడం జరిగింది. 2002 -2009 వరకు అన్నీ కూడా ఉమ్మడి ఏపీ గా ఉన్నప్పుడు ఆయనే చూసుకున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పిన వారికి టికెట్లు కూడా ఇచ్చేలా చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం.



అంతేకాకుండా తాను తీసుకొచ్చిన పథకాలను సైతం ప్రవేశపెట్టి జై కొట్టేలా చేసుకున్నారు. అందుకే అధిష్టానం కూడా ఎక్కువగా రాజశేఖర్ రెడ్డి కి రిఫరెన్స్ ఇస్తూ ఉండేది. అంతేకాకుండా ఏపీలో రాజశేఖర్ రెడ్డిని ఎదిరించే వారు కూడా ఎవరూ లేరు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పిన మాటను ఎవరు కూడా జవదాటే వారు కాదు. దీంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పైన కూడా చాలానే విమర్శలు వినిపించాయి.. జాతీయ పార్టీని సైతం వైయస్సార్ ప్రాంతీయ పార్టీగా చేసుకున్నారనే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.


అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఎలాంటి మార్పులు చేయలేకపోయారు.. ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్ గా వైయస్ షర్మిల ఉన్నారు. ఇమే ఢిల్లీలో పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రస్థాయి కమిటీలు జిల్లా స్థాయి ఇన్చార్జిలు నిర్మించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమెకు నచ్చిన వారిని తనకు మెచ్చిన వారికి మాత్రమే ఈ పదవులు ఇచ్చి మరి కూర్చోబెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద 52 మంది పేర్లతో అతిపెద్ద జాబితాను సైతం షర్మిల అందించారట. ఒకవేళ జాబితాకు అధిష్టానం ఓకే చెబితే కచ్చితంగా చాలామంది కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే నాయకులు కనిపిస్తారట. మరి అప్పటి వైయస్ కు ఉన్న ప్రాధాన్యత ఇచ్చి పుంజుకునేలా చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల విషయంలో కూడా అదే సాగుతుందా లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ ఏపీలో షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం ఉందా లేదా అనేది ఈ జాబితాను బట్టే తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: