అదే ఏడాది వీరందరికీ ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ జలపాల్సి ఉండగా పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వళ్ల ఈ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటి పైన చర్యలు తీసుకొని ఈనెల ఆఖరిలో నియామక పత్రాలను సైతం పునర్ ప్రారంభించాలని ఒక షెడ్యూల్ ని కూడా ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఎన్నో ఏళ్లగా ఉద్యోగం కోసం చాలా మంది నిరుద్యోగులు కూడా ఇతర ప్రాంతాలలో ఉంటూ చదువుకుంటూ ఉంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన ఇప్పటివరకు అందుకు సంబంధించిన ప్రక్రియను మాత్రం తెలియజేయలేదు.. మరి ఇలాంటి సమయంలో కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని 20,000 పోలీసు ఉద్యోగాల కొరత ఉందని తెలియజేస్తున్న కూటమి ప్రభుత్వం ఇందులో ఎన్ని పోస్టులు ఇస్తారా అనే విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు.. ఏది ఏమైనా నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది అని చెప్పవచ్చు. అలాగే ఒకవైపు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని విధాల మంచి చేకూరాలని పలు రకాల కార్యక్రమాలను చేయబడుతున్నారు.