పోలీసులు సైతం వహీద్ కోసం గాలిస్తున్న సమయంలోనే ముగ్గురు యువకులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వాహీద్ అనూహ్యంగా ఆత్మకూరు శివారులలో ఉండేటువంటి ఒక భావి దగ్గర శవమై కనిపించారట. దీంతో ఆ తల్లిదండ్రుల సైతం కన్నీరు మునీరు అవుతున్నారు. అయితే యువకుడిని కిడ్నాప్ చేసినా వాళ్ళే చంపేశారా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారా అనే విషయంపై ఇంకా అధికారులు ఆరా తీస్తున్నారట.
వహీద్ తన స్నేహితురాలిని ప్రేమిస్తున్న విషయం ఆ బాలిక కుటుంబ సభ్యులకు తెలిసి కిడ్నాప్ చేయించారనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వహీదును సైతం కొట్టి వదిలేసామని.. వహీద్ ని చంపలేదని బాలిక బంధువులు అయితే తెలియజేస్తున్నట్లు సమాచారం. కానీ వాహీద్ ని కిడ్నాప్ చేసి కొట్టారని మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నారనే విధంగా మృతుడి తల్లిదండ్రులు ఈ విషయం పైన వాదిస్తున్నారు. ఏపీలో ఇలాంటి దారుణమైన ఘటనలు ఎక్కువగా జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్న మరింత ఎక్కువగా రోజురోజుకి ఇలాంటి సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయి.
ముఖ్యంగా విద్యార్థుల విషయం పైన ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉండడంతో తల్లితండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.