ఇలా మూడు పూటల అన్న క్యాంటీన్లో ఆహార పదార్థాలతో పాటు ప్రత్యేకమైనను కూడా రూపొందించామని తెలిపారు. వీటిని హరే కృష్ణ చారిటబుల్ ట్రస్టు అక్షయపాత్ర వారు కూడా నిర్వహించబోతున్నారంటూ వెల్లడించారు.అయితే ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విరాళాలు అందించాలి అంటూ ప్రజల కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా అందుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని కూడా తెలియజేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే గతంలో కూడా అమరావతి కట్టడం కోసం విరాళాలు ఇవ్వాలి అంటూ తెలియజేయడంతో ఆ ఎఫెక్ట్ భారీగానే చూపించింది 2024 ఎన్నికలలో.
ఇప్పుడు మళ్లీ అన్నా క్యాంటీన్లు నడపడానికి మళ్లీ విరాళాలను అడుగుతూ ఉండడంతో చాలామంది ప్రజలు, నేతలు సైతం కౌంటర్లు వేస్తూ ఉన్నారు. గతంలో ఇలాంటి తప్పునే చేశారు చంద్రబాబు మళ్లీ ఇప్పుడు అదే చేస్తున్నారట .అన్నా క్యాంటీన్లు నడపడం మంచిదే కానీ.. ఇలా విరాళాలు సేకరించి నడపడం వల్ల ఏమి ఉపయోగం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల ముందు హామీలతో ప్రజలని మభ్య పెట్టారంటూ వైసీపీ నేతలు కూడా తెలియజేస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి పథకాలను అమలు చేయకుండా కేవలం కక్ష పూజిత రాజకీయాలు మాత్రమే చేస్తున్నారంటూ వాపోతున్నారు. మరి ఇకనైనా ఏపీ సీఎం చంద్రబాబు తాను ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.