టిడిపి పార్టీలో ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు అయితే అన్నిటిని చూసుకుంటున్నారు. ఆయన తర్వాత ఆ పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలని విషయంలో ఎప్పటినుంచి ఒక చర్చ అయితే వినిపిస్తూనే ఉంది.. కానీ చంద్రబాబు తర్వాత ఆయన కుమారుడే టిడిపి పార్టీ పగ్గాలు అప్పగించాలని తన కొడుకుని కూడా ప్రమోట్ చేస్తున్నారనే విధంగా చాలామంది ఎమ్మెల్యేలు కూడా లోకేష్ కే సపోర్ట్ చేస్తున్నారని విధంగా వార్తలు వినిపించాయి. మొదట్లో ఎన్నో రకాల ట్రోల్స్ కి గురయ్యారు లోకేష్.. అయితే ఆ తర్వాత తనని తాను మలుచుకోవడం జరిగింది. కానీ అంతకంటే ఎక్కువ మంది లోకేష్ ను వ్యతిరేకిస్తూ జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీని నడపాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారట.


అయితే ఎన్టీఆర్ పేరు వినిపిస్తే చాలు చాలామంది టిడిపి నాయకులు తేలిగ్గా తీసి పడేస్తున్నారట. అలాంటి నేతలలో కృష్ణాజిల్లా నేత బుద్ధ వెంకన్న కూడా ఒకరని చెప్పవచ్చు.. ఈయన ఎక్కువగా ఎప్పుడు లోకేష్ కే సపోర్టు చేస్తూ ఉంటారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో టిడిపి భవిష్యత్తు నాయకత్వం గురించి మాట్లాడుతూ.. తాను చంద్రబాబుతో పాటు భూనేశ్వరి లోకేష్ నాయకత్వానికి జై కొడతానని అలాగే భవిష్యత్తులో కూడా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్  రాజకీయాల్లోకి వచ్చి కూడా ఆయన కోసమే పనిచేస్తానంటూ తెలిపారు బుద్ధా వెంకన్న.


జూనియర్ ఎన్టీఆర్ సంగతి ఏంటి అని అడిగితే అతని నాయకత్వాన్ని ఒప్పుకోనంటూ తేల్చి చెప్పారు.. గడిచిన ఐదేళ్లలో నారా కుటుంబం టిడిపి పార్టీ కోసం చాలా కష్టపడి మరి పార్టీని నిలబెట్టారంటూ తన నాయకత్వం గురించి ప్రశ్నించే వారందరికీ ఇదే సమాధానం అని కూడా తెలియజేశారు. అలాంటి నాయకుల కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగానే ఉన్నానంటే తెలియజేశారు బుద్దా వెంకన్న.. అయితే గతంలో కూడా ఈయన జూనియర్ ఎన్టీఆర్ పైన పలు రకాల విమర్శలు చేయడం కూడా జరిగింది.దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. ఇప్పుడు మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ పైన ఇలాంటి కామెంట్స్ చేయడంతో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: