మాజీ మంత్రి, ప్రముఖ నటి రోజా గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా ఒకింత సైలెంట్ అయ్యారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే రోజా భర్త పేరు సెల్వమణి కాగా వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక కొడుకు, కూతురు కాగా పెళ్లి తర్వాత అన్యోన్యంగా ఉన్న ఈ జోడీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.
 
అయితే రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపును సొంతం చేసుకున్న రోజా లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. సెల్వమణి రోజాను ప్రేమించిన తర్వాత మొదట ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించి వాళ్ల మెప్పు పొందారు. కులం, ప్రాంతం వేర్వేరు కావడంతో రోజా ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో అనే టెన్షన్ సెల్వమణిని వెంటాడింది.
 
రోజా తల్లీదండ్రులు పెళ్లికి అంగీకరించడంతో ఆ తర్వాత ఐలవ్యూ అంటూ లవ్ ప్రపోజ్ చేసి సెల్వమణి రోజా కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో ఆమెకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుందాం అని చెప్పారు. దాదాపుగా 11 సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత చివరకు రోజా సెల్వమణి పెళ్లి జరిగింది. సెల్వమణి కులం వేరైనా పెళ్లికి రోజా తల్లీదండ్రులు అంగీకరించడం, సెల్వమణి రోజాతో పెళ్లి కోసం ఏకంగా పదేళ్లు ఎదురుచూడటం అంటే సాధారణమైన విషయం కాదనే చెప్పాలి.
 
గత మూడేళ్లుగా సినిమాలు, షోలకు దూరంగా ఉన్న రోజా రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. రోజాపై కొన్ని అవినీతి ఆరోపణలు వినిపిస్తుండగా వాటిని ఆమె ఏ విధంగా ఎదుర్కొంటారనే చర్చ సైతం జరుగుతుండటం కొసమెరుపు. రోజాను అభిమానించే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉండటం గమనార్హం.
 


మరింత సమాచారం తెలుసుకోండి: