వైసిపి మహిళా నేత రోజా అని అరెస్టు చేస్తారా.. చెయ్యాలి చేయాలి అని ఆవేశంగా మాట్లాడేటటువంటి టిడిపి పార్టీలో చాలామంది నేతలు ఉన్నారు. బేసిగ్గా వల్లభనేని వంశీ ,కొడాలి నాని, వాళ్లు దుర్భాషల ఆడాడం లేకపోతే కుటుంబం గురించి దుర్భాషలాడారు వాళ్ల మీద ఆగ్రహం ఉంటుంది. జోగి రమేష్ మీద ఎందుకు ఆగ్రహం ఉందయ్యా అంటే అతడు చంద్రబాబు ఇంటి దగ్గర వరకు వెళ్లి హడావిడి చేశారనే విధంగా వార్తలు వినిపించాయి.. దేవినేని అవినాష్ మీద ఎందుకు ఉందంటే పార్టీ కార్యాలయం మీద దాడి చేయించారని అవినాష్ అన్నటువంటి అంశం ఉన్నది కాబట్టి.


రోజా ఏం చేసిందంటే.. బాలకృష్ణ గురించి ఆయన మొహమాటం లేకుండా మాట్లాడుతుంది.. లోకేష్ గురించి గానీ చంద్రబాబు గురించి గానీ పవన్ కళ్యాణ్ గురించి గానీ మాట్లాడుతుంది కానీ దుర్భాషలు ఎప్పుడూ మాట్లాడదు.. కానీ ఒక మహిళ నేత సెటైర్లు వేస్తే నచ్చదు.. ఆడవాళ్లు రాజకీయం చేస్తే నచ్చదు.. వ్యక్తిత్వ అసహనాన్ని తెలియజేస్తాం.. ఇదివరకు అనిత విషయంలో వీళ్ళు చేసినటువంటిది ఇప్పుడు వీళ్లు రోజా విషయంలో చేస్తున్నారు..


ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు.. అంతేకాకుండా ఆడదాం ఆంధ్ర అదొక ప్రోగ్రామ్ గా నడిపారు. దాంట్లో తినేశారు అంటూ ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. దాని ఆధారంగా కేసు పెట్టడం.. అరెస్టు చేసేయడం జైల్లో వేయడం  వంటివి చేయాలని టిడిపి నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇలా చేయలేరు కానీ ముందుగా నోటీసిస్తారు.. ముఖ్యంగా అందులో టెండర్ ప్రకారం జరిగిందా లేదా.. టెండర్ ప్రకారమే భోజనాలు పెట్టారా.. టెండర్ ఎవరికి ఇస్తే వారికి వెళ్ళిందా లేదా.. ఆ సామాన్లు టెండర్ ప్రకారం కొన్నారా లేదా.. అనే వంటి వాటిని చూస్తారు తప్ప. ఆటలో ఎవరు ఏడ్చారు ఎవరు అన్నం సరిగ్గా తినలేదు.. లేకపోతే బ్యాట్ విరిగిందని వాటిపైన అరెస్టు చేస్తారా.. ముఖ్యంగా ఇండియన్ క్రికెటర్లు ఆడేటప్పుడు కూడా బ్యాట్లు విరిగిపోతాయి అప్పుడు బిసిసి పై కూడా కేసు వేస్తారా.. ఇలాంటి విచిత్రమైనటువంటి నెగిటివ్ సృష్టించడానికి ఏవైనా మాట్లాడుతూ ఉంటారు. మరి రోజా అని అరెస్టు చేసి సంచలనం సృష్టిస్తారా లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: