ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలుబడిన తర్వాత ఒక్కసారిగా ఈవీఎం గోల్మాల్ జరిగిందనే విధంగా వైసిపి నేతలు కార్యకర్తలు సైతం తెలియజేస్తూ వచ్చారు. దీంతో  కూటమి నేతలు ఓడిపోయిన వారందరూ కూడా ఈవీఎంల పైన నిందలు వేయడం సర్వసాధారణం అన్నట్టుగా తెలియజేశారు. అందుకే వైసిపి పార్టీ చేసిన ఆరోపణలను సైతం ఎవరు పెద్దగా పట్టించుకోలేదని చెప్పవచ్చు. కానీ అనుకోకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చెప్పిన వాటి ప్రకారం లెక్కలలో చాలా తేడాలు ఉన్నాయని విధంగా ఏజెన్సీలు చెబుతూ చాలామంది ఈ విషయాన్ని వైరల్ గా చేశారు.


ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్న విషయాన్ని సైతం తెలియజేస్తూ చెప్పారు. ఎన్నికలలో పోలైన ఓట్లకు సైతం ఆ తర్వాత లెక్కించిన ఓట్లకు చాలా వ్యత్యాసం ఉన్నదంటూ ఒక లెక్కను కూడా విడుదల చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే మరింత ఎక్కువగా ఉందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్లకు కౌంటింగ్ రోజున ఓట్లయినా తేడా 45 లక్షలు పైగా ఉందని విషయాన్ని ఇటీవలే బయటపెట్టారు. దీంతో కొంతమంది ఈవీఎం ప్యాడ్లు ఈవీఎం మిషన్లపైన అనుమానాలను సరితం తెలియజేశారు.


రీకౌంటింగ్ చేయాలంటూ ఎన్నికల సంఘానికి అభ్యర్థించడం కూడా జరిగింది. అయితే ఈ అవకాశం కేవలం ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది అంటే తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసి మొదటి రెండవ మూడవ స్థానాలలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే వారం రోజుల లోపే ఈ అంశం పైన ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేయవచ్చు అంటూ తెలియజేశారు. దీనివల్ల రీకౌంటింగ్ కోసం అభ్యర్థులు కాస్త రుసుమును కూడా చెల్లించాల్సి ఉంటుందట. అలాగే ఈవీఎం పేర్లలో నుంచి వచ్చిన స్లిప్పులు గుర్తుల ప్రకారం ఆ ఈవీయంలో కూడా సేమ్ ఓటింగ్ ఉన్నాయా లేవా అనే విషయం చెక్ చేయవలసి ఉంటుంది. కానీ ఎలక్షన్ కమిషనర్ మాత్రం కేవలం మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటూ తెలుపుతున్నారు. అంటే మీరు ఓటు వేయండి ఆ వేసిన గుర్తుకి పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకునేదే ఈ మాక్ పోలింగ్. ఇక్కడే అందరికీ అనుమానాలు మొదలవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: