గడిచిన నాలుగు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో ఒక దారుణ హత్య జరిగింది.ఇందులో భాగంగానే పత్తికొండ మండలంలో టిడిపి పార్టీ నేతను కొంతమంది చాలా దారుణంగా హతమార్చడం జరిగిందట. ఆ తర్వాత పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు ప్రధాన అనుచరుడు అయిన శ్రీనివాసులు బయటికి వెళ్ళగా కొంతమంది దుండగులు కళ్ళల్లో కారం చెల్లి మరి హత్య చేశారట.. ఈ విషయం ఒక్కసారిగా టిడిపి నేతలను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ హత్యతో రాజకీయరంగు మరొకసారి పులుముకున్నట్లు తెలుస్తోంది.


టిడిపి నేతలు సైతం వైసీపీ పైన విరుచుకుపడ్డారట. ఈ విషయం తెలుసుకున్న అక్కడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఈ సంఘటన స్థలానికి చేరుకొని మరి ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించారట. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శ్రీనివాసులు తల పైన కూడా చాలా పెద్ద గాయం అయిందనీ వెనకాల నుంచి కొడవలితో ఎవరు నరికినట్లుగా గుర్తించామని తెలిపారు. ఈ కేసును సైతం అన్ని కోణాలలో కూడా విచారిస్తున్నామంటూ తెలిపారు. అలాగే నిందితుల కోసం కూడా గాలిస్తున్నామంటే తెలిపారు ఎస్పీ.



అయితే శ్రీనివాసులు గ్రామంలో ఎవరితో కూడా పెద్దగా గొడవలు లేవని కానీ హత్య జరిగిన ప్రాంతానికి ఒక కిలోమీటర్ల దూరంలో మందు సీసాలు ఉన్నట్లుగా తెలియజేశారు.ఈ హత్య పైన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఫైర్ అయ్యారు. పత్తికొండలో టిడిపి మాజీ సర్పంచ్ శ్రీనివాసులను వైసీపీ మూకలు దాడి చేశారంటూ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ తెలియజేశారు. ఎన్నికలలో టిడిపి పార్టీ నుంచి పోటీ చేశారని రాజకీయ కక్షతోనే ఇలా కళ్ళల్లో కారం కొట్టి చంపారు అనే విధంగా తెలియజేశారు. శ్రీనివాస కుటుంబానికి టిడిపి పార్టీ అండగా ఉంటుంది అంటు తెలిపారు. అయితే శ్రీనివాసులు హత్యను టిడిపి పార్టీకి చెందిన నర్సింహులు హత్య చేయించారని తెలియజేశారు. గతంలో వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు కారణంగా.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పదవుల నేపథ్యంలోనే ఈ హత్య చేసినట్లుగా అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా గతంలో నరసింహులను శ్రీనివాసులు చెప్పుతో కొట్టారని దీంతో ఇద్దరి మధ్య గొడవ అప్పుడు మొదలైందని ఆ గొడవను కక్ష తీర్చుకోవడానికి ఇలాంటి దారుణానికి ఒడిగట్టారని అధికారులు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: