గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి కోల్కత్త వైద్యురాలి రేప్ మర్డర్ ఘటనతో ఒక్కసారిగా దేశమంతా చెలరేగిపోయింది. ఈ దారుణాన్ని ఇప్పుడు మరువక ముందే ఆంధ్రప్రదేశ్లో మరో ఘటన చోటు చేసుకుంది.. జీవనోపాధి కోసం వచ్చిన భార్యాభర్తల పైన.. ముగ్గురు యువకులు భర్తను చితక్కొట్టి భార్య పైన అత్యాచారం చేసిన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.


ఏలూరు కు జీవనోపాధి కోసం వచ్చిన భార్యాభర్తలు ఒక హోటల్లో పని చేస్తూ ఉన్నారట.. అయితే జీతం డబ్బులు వచ్చాక ఇంటిని అద్దెకు తీసుకుందామని అక్కడ దగ్గరలో ఉండి ఒక భవనంలో రాత్రి సమయాలలో నిద్రపోయేవారట. అయితే వీరిని గమనించిన ముగ్గురు జులాయిలు వారితో పరిచయాలు ఏర్పరచుకొని .. ఆ వ్యక్తి భార్య పైన కన్నేసారు. దీంతో వారితో చనువుగాని మెలుగుతూ.. పక్క ప్లాన్ ప్రకారం ఆమె భర్తకు మందు తాగించి నిద్రలోకి జారిపోయిన తర్వాత.. ఆమెను శారీరకంగా సహకరించాలని అనుకున్నారట.. ఆమె సహకరించకపోతే తన భర్తను చంపేస్తామంటూ ఆ జులాయిలు బెదిరించారట.


దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను ఈడ్చి కెళ్ళి అత్యాచారం చేసే ప్రయత్నం చేయక ఆమె గట్టిగా కేకలు వేయడంతో నిద్రలేచిన భర్త ఆ యువకులను అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా వారు అతడి పైన తీవ్రంగా దాడి చేశారు. ఆ తర్వాత భార్యను దగ్గరలో ఉన్న భవనంలోకి లాకెళ్లి మరి ఆమె పైన అత్యాచారం చేసినట్లుగా సమాచారం. దీంతో నడవ లేకుండా చేసిన ఆ వ్యక్తి రోడ్డుపైన వెళ్లి సహాయం కోసం అడగగా అటువైపుగా వెళుతున్న కొంతమంది యువకులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు అక్కడికి రాగానే ఆమెను వదిలేసి పారిపోయారు. దీంతో వారి పైన కేసు నమోదు కాగా పోలీసులు వారిని చేదించి పట్టుకున్నారు. ఆ మహిళలకు మెరుగైన వైద్యం కోసం ఏలూరులో జిసిహెచ్ఎంకు తరలించారు. కానీ ప్రభుత్వాలు ఎలాంటివి ఎన్ని తీసుకున్న కూడా ఏదో ఒక మూలాన ఇలాంటి సంఘటనలు రోజుకొకటి జరుగుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: