* రాష్ట్రంలో కొనసాగుతున్న నామినేటెడ్ దంగల్
 
* కీలక పదవుల కోసం తీవ్రమైన పోటీ

* అన్న కోసం ఏకంగా ఆ కీలక పదవిని కోరిన పవన్ కల్యాణ్..?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ని గద్దె దించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి కలిసికట్టుగా ఒక ప్రణాళికను రూపొందించుకొని వైసీపీ పై ఎదురు దాడి చేసాయి.. దీనితో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది..కూటమి అత్యధిక సీట్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే కూటమి అఖండ విజయం సాధించడంలో ఇరు పార్టీ కీలక నేతల సహకారం ఎంతో వుంది. వారంతా కలిసికట్టుగా పని చేయడం వల్లే కూటమి ఇంతటి భారీ విజయాన్ని సాధించింది.. పార్టీల పరంగా కీలక నేతల గురించి చెప్పుకుంటే జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడానికి ఆ పార్టీ కీలక నేతల అలుపెరుగని కృషి ఫలితమే కారణం. జనసేన కోసం ఎందరో నేతలు కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేసారు..అందులోనూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు అనేక మంది ఆయనకు అండగా నిలిచారు.అందులో పవన్ సోదరుడు నాగబాబు కూడా ఒకరు. నిజం చెప్పాలంటే నాగబాబు పార్టీలో కీలక భూమిక పోషించారు.



మెగాస్టార్ అభిమానులందరినీ ఎన్నికల వేళ ఒక్కటి చేయగలిగారు. కాపు సామాజికవర్గంలోనూ చీలిక రాకుండా అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలను ఏర్పాటు చేసిన నాగబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ కు చేదోడు వాదోడుగా నిలిచారు. మెగా కుటుంబంలో ఎవరూ పెద్దగా ప్రచారంలో పాల్గొనకపోయినా కూడా నాగబాబు మాత్రం పవన్ గెలుపునకు చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది.అయితే గత 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నుంచి జనసేన తరపున పోటీ చేసిన నాగాబాబు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2024 లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసమే ఆయన కృషి చేసారు... పిఠాపురంలోనే వుంటూ పవన్ కల్యాణ్ కు అత్యధిక మెజారిటీ వచ్చేలా నాగబాబు చేసిన కృషికి జనసేన నేతలు కూడా ప్రశంసలు అందించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ బిజీగా ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాలను అంతా తానే భుజాన వేసుకుని, పార్టీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పవన్ కు మాట రాకుండా చూసుకున్నారు.ఇలా కూటమి అధికారంలోకీ రావడానికి నాగబాబు తన వంతు సాయం చేసారు..


అయితే కూటమి అధికారంలోకి రావడంతో  ఇరు పార్టీల కోసం కష్టపడిన నాయకులు నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.. అయితే జనసేన తరుపున నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే దీనిని నాగబాబు ఖండించారు. అలాంటి ప్రతిపాదన ఏమి లేదని, అటువంటి ఆలోచన కూడా తనకు లేదని నాగబాబు స్పష్టం చేసి టీటీడీఛైర్మన్ పదవిపై క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో నాగబాబు చురుగ్గా పాల్గొంటున్నారు. ఒక వైపు సినిమాలు చేసుకుంటూనే పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. అలాగే కార్యకర్తలను స్వయంగా కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు..


కానీ తాజాగా నాగాబాబుకు నామినేటెడ్ పదవి ఇస్తారన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనుండటంతో అందులో జనసేన వాటా కూడా ఉండటంతో ఈసారి నాగబాబు పేరును పవన్ కల్యాణ్ కన్ఫర్మ్ చేస్తారన్నది పార్టీ వర్గాల నుంచి సమాచారం అందింది..తన అన్నకు నామినేటెడ్ పోస్టు ఇస్తే  తనకు తోడుగా ఉంటారని పవన్ భావిస్తున్నారట.. అందుకోసమే నాగబాబుకు ఓ కీలక పదవిని రిజర్వ్ చేసినట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం.నాగబాబుకు ఎంతో ఇష్టమైన ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నాగబాబును నియమించే అవకాశాలున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: