ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇటీవల అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ... అత్యంత ఘోరంగా ఓడిపోయింది. కనీసం 70 నుంచి 90 సీట్లు వైసిపి పార్టీకి వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసలు 20 సీట్లు కూడా వైసీపీకి దాటలేకపోయాయి. అతి కష్టంగా 11 సీట్లు వైసిపి సంపాదించుకోగలిగింది.

అయితే.. వైసిపి ఇలా దారుణంగా ఓడిపోవడానికి ముఖ్య కారణం షర్మిల కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  ఇంట్లో ఉన్న షర్మిల... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకొని... జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచినట్లు చెబుతున్నారు. ఆమె జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం.. ముఖ్యంగా వైఎస్ వివేకానంద హత్య కేసును హైలెట్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి మైనస్ అయిందని చెబుతున్నారు.

గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైయస్ షర్మిల మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి. వైయస్ షర్మిల అలాగే జగన్మోహన్ రెడ్డి మధ్య ఆస్తి తాగదాలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఇద్దరు విడిపోయినట్టు కూడా చెబుతున్నారు. అయితే షర్మిల.. జగన్మోహన్ రెడ్డిని.. దూరం పెట్టిన తర్వాత వైసీపీకి కష్టాలు ప్రారంభమైనట్లు కూడా చెబుతున్నారు. తెలంగాణలో వైసిపి పేరుతో కొత్త పార్టీని షర్మిల పెట్టడం.. మళ్లీ ఏపీకి వచ్చి కాంగ్రెస్ అధ్యక్షులుగా మారడం కూడా జగన్మోహన్ రెడ్డికి మైనస్ గా మారినట్లు అంటున్నారు.

ఇక తాజాగా రక్షాబంధన్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి మరో ఊహించని షాక్ తగిలింది.అన్న చెల్లెల పండుగైన రక్షాబంధన్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి షర్మిల అసలు విశేష్ చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలందరికీ.. రాఖి పండగ శుభాకాంక్షలు చెప్పారు. కానీ షర్మిల మాత్రం ఆయనకు రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పలేదు. ఇంటికి వచ్చి ఎప్పుడు రక్షాబంధన్ పండుగ జరుపుకునే వారు వయస్ కుటుంబ సభ్యులు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: