సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక పెద్ద సమస్య వచ్చింది.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి కట్ ఆఫ్ ఏం పెట్టిందంటే ఐదు సంవత్సరాలు దాటినటువంటివాళ్లు ఒకే చోట ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి వారికి ట్రాన్స్ఫర్ పెట్టింది. సచివాలయ ఉద్యోగస్తుల పరిస్థితి ఏమైందంటే దశల వారీగా వారిని నియమించడం జరిగింది. మొట్టమొదటి దశలో ఉండేటువంటి వారికి మాత్రమే ఐదేళ్లు పూర్తీ అయ్యి ఉంటుంది. వాళ్లకి మాత్రమే ట్రాన్స్ఫర్లు అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు 10 నెలలు అనేటట్టుగా ఉంటుంది.


 వాస్తవానికి సచివాలయ ఉద్యోగులు లక్ష 30 వేల మంది ఉన్నారు. అప్పట్లో జగన్ సర్కార్ వీటి బదిలీలను ఓకే చెబుతూ రెండు కాన్సెప్ట్లను తీసుకువచ్చింది. ఒకటి అనారోగ్య కారణాలతో ఎక్కడికైనా బదిలీ కోరుకుంటే.. మరొకటి ఏమిటంటే భార్య భర్త ఇద్దరు ఒకే చోట ఉండడం. అయితే సచివాలయ ఉద్యోగంలో చేరిన వారంతా కూడా వివాహం కాని వారు 100కి 90 శాతం మంది ఉన్నారట. ఇప్పుడు వారందరికీ కూడా ట్రాన్స్ఫర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటి.


వారందరూ కోరుకున్నది బాబు సర్కార్ ను ఒక్కటే.. నాలుగు సంవత్సరాల ఆరు నెలలకి మార్చండి అంటూ. సచివాలయ ఉద్యోగుల విషయానికి వస్తే జగన్ హయాంలో నియమితులైన వారు కాబట్టి.. ఇప్పుడు వీరికి ఈ అవకాశం ఇస్తారా.. ఒకవేళ ఈ అవకాశం ఇవ్వకపోతే.. మళ్లీ ఎన్ని రోజులకు ఇస్తారో తెలియదు. కొత్తగా వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఆ తర్వాత చేయడం అనేది కష్టంగానే ఉంటుంది. లేదు అంటే ఏళ్ల తరబడి పని సాగిపోతూ ఉంటుంది.మరి ఏపీ ప్రభుత్వం వీరి పైన ఏం చేస్తుందో చూడాలి మరి. అయితే ఇప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగంలో కేవలం కొన్ని శాఖలకు మాత్రమే ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: