* ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ నిర్ణయాలు ఎప్పటికీ సంచలనమే..

* అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో దేవుడిగా మారిన ఎన్టీఆర్..

* ఎన్టీఆర్ తెచ్చిన పధకాలు ఎందరో రాజకీయ నాయకులకు స్ఫూర్తి..



విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు నందమూరి తారక రామారావు.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..మే 28, 1923న కృష్ణా జిల్లా లోని నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్ 1949లో సినిమాల్లోకి అడుగుపెట్టారు.ఎన్టీఆర్‌ తన అద్భుతమైన నటనతో తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేశారు. ఆయన ఎన్నో విభిన్న పాత్రలలో నటించి మెప్పించారు. సినిమాల్లో తిరుగులేని స్థాయికి ఎదిగిన ఎన్టీఆర్‌ పొలిటికల్ గా కూడా అలాగే సక్సెస్ అయ్యారు. తెలుగువారికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక ఆనాడు ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా తెలుగు దేశం పార్టీ స్థాపించారు..1983 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ అద్భుత విజయం సాధించింది. పేదలకోసం ఎన్నో పధకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, ఆస్తిలో ఆడపిల్లకు భాగం, పేదలందరికి ఇల్లు వంటి పధకాలు అమలు చేసి ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారు. 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా ఎన్నికైన ఎన్టీఆర్ 1989 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన పార్టీని గెలిపించలేకపోయారు.


ఇదే సమయంలో రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమం ఎంతో ఉదృతమయ్యింది. దూబగుంట రోశమ్మ నాయకత్వంలో ఆనాడు మహిళలంతా ఒకే తాటిపైకి వచ్చారు. ఈ పోరాటానికి పేద, గ్రామీణ స్త్రీల నుంచి మధ్యతరగతి, పట్టణ స్త్రీల వరకు మద్దతు లభించింది. గాంధీజీ సిద్ధాంతాలను, ఆదర్శాలను అనుసరించే పురుషులు కూడా ఈ సంపూర్ణ మద్య నిషేధానికి మద్దతు తెలిపారు. స్త్రీలంతా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి తమ గ్రామాల నుంచి పోరాటాలు చేశారు.రోశమ్మ స్పూర్తితో కదిలిన ఆనాటి ప్రతిపక్షనేత ఎన్టీఆర్ తన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధికారంలోకి వస్తే ‘సంపూర్ణ మద్యపాన నిషేధం’ అమలు చేస్తామని ప్రకటించారు. ఆయన మాట మీద వున్న నమ్మకంతో ప్రజలు టీడీపీని భారీ స్థాయిలో గెలిపించారు.


అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 1995 జూన్ 1 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ మొదటి సంతకం చేశారు.అయితే ఆ తరువాత టీడీపీలో జరిగిన నాటకీయ పరిణామంతో అప్పటి సీఎం ఎన్టీఆర్ ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే ల మెజారిటీతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి అయ్యారు.. దీనితో అక్రమ మద్యం, నాటుసారా కారణంగా సంపూర్ణ మద్య పాన నిషేధం అమలు చేయలేకపోతున్నామని 1997లో  చంద్రబాబునాయుడు ఈ నిషేధాన్ని ఎత్తివేశారు.. దీనితో రాష్ట్రంలో మళ్ళీ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: