ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి అందరికీ సుపరిచితమే.. ఎంతోమంది హీరోయిన్లకు రాజకీయ నాయకులు జాతకాలు చెప్పిన ఈయన నిన్నటి రోజున రాత్రివేళ తమ ఇన్స్టాగ్రామ్ లో ఒక సంచలన వీడియోని షేర్ చేశారు. ప్రముఖ ఛానల్లో ఉంటున్న టీవీ ఫైవ్ మూర్తి తమను ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ వేణు స్వామి దంపతులు ఒక వీడియో ద్వారా విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. గతంలో టీవీ5 జర్నలిస్టు మూర్తి మహా టీవీలో పనిచేసేవారు. అప్పుడు కూడా తనపైన దాడి చేయించారంటే తెలిపారు వేణు స్వామి దంపతులు.


కేవలం తనను నాశనం చేయడానికి ఆ సమయంలో ఎన్నో ప్రయత్నాలు చేశారంటూ తెలిపారు. అయితే ఇప్పుడు మళ్లీ చాలా రోజుల తర్వాత డబ్బు కోసం ఆయన టీం తనని ఇబ్బంది పెడుతోంది అంటూ తెలిపారు. ఒక పథకం ప్రకారమే టీవీ ఫైవ్ లో తన గురించి డెబిట్ లు పెట్టి చాలా తప్పుగా ప్రచారం చేస్తున్నారని కూడా తెలిపారు. ఎంతో మంది కష్టాలను తొలగించిన నాకు చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకువచ్చారు మూర్తి అంటూ ఎమోషనల్ గా తెలియజేశారు వేణు స్వామి ఆయన భార్య శ్రీవాణి.



అయితే ఆయన ఐదు కోట్ల డిమాండ్ చేసిన డబ్బును కూడా ఎవరెవరు పంచుకుంటారో కూడా తెలియజేశారు. ఆ డబ్బును ఆ ఛానల్ అధినేత బీర్ నాయుడు, ఆ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగుల వరకు ఎలా పంపిస్తారో కూడా తెలియజేశారు. అంతేకాకుండా వేణు స్వామి భార్య మాట్లాడుతూ అంత డబ్బు మేము తీసుకురాలేము తన బంగారు తన కూతురు బంగారు అమ్మినా కూడా కనీసం అందులో ఐదు పర్సంటేజ్ కూడా ఇవ్వలేమంటూ తెలిపింది. తమకు ఆత్మహత్య శరణం అంటూ కూడా తెలుపుతున్నారు. అలాగే ఈ వీడియోలో వాళ్ళ అసలు రూపాన్ని కూడా బయటపెట్టారు ఈ దంపతులు. మరి ఈ వీడియో చూసిన తర్వాత అయినా అటు జర్నలిస్టులు, బ్రాహ్మణ సంఘాలు చదువుకున్న వారు లేదా లాయర్లు పోలీసులు సైతం సపోర్టు చేస్తారేమో చూడాలి. మాలాంటి వారి దగ్గర ఇంత డిమాండ్ చేసినప్పుడు ఇక మిగిలిన వారి దగ్గర ఎలా తీసుకుంటారో చెప్పాల్సిన పనిలేదంటూ వేణు స్వామి దంపతులు ఆవేదన చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: