సీనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా సాధించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. పేదలు కడుపు నిండా తినాలి అనే మంచి ఆలోచనతో అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కోట్ల సంఖ్యలో ప్రజల ఆకలి తీర్చడంతో పాటు ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగానే రేషన్ బియ్యం పథకం అమలు చేస్తున్నారనే సంగతి తెలిసిందే.
 
వైసీపీ నేతలు సైతం సీనియర్ ఎన్టీఆర్ గారికి ఒక శకం ఉందని 2 రూపాయలకే కిలో బియ్యం అనే పథకం ఎన్టీఆర్ పేదోడి కోసం పెట్టారని అన్నారు. ఒక సందర్భంలో పేర్ని నాని ఈ కామెంట్లు చేశారు. 2 రూపాయలకే కిలో బియ్యంతో దేశ చరిత్రలో సంచలన పథకం అమలైంది. తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్ పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించారు. ఈ పథకంతో సీనియర్ ఎన్టీఆర్ సంక్షేమంపై చెరగని సంతకం చేశారని చెప్పవచ్చు.
 
సీనియర్ ఎన్టీఆర్ స్పూర్తితో పలువురు 2 రూపాయలకే భోజనం పెట్టారంటే ఈ పథకం ప్రజల మదిలో ఏ స్థాయిలో స్థానం సంపాదించుకుందో సులువుగా అర్థమవుతుంది. ఈ పథకం గురించి తెలిసి ఇతర రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని అమలు చేశారంటే ప్రజల్లో ఈ పథకానికి ఎంత మంచి పేరు ఉందో సులువుగానే అర్థమవుతుంది. ఈ పథకం అమలుతో ఎన్టీఆర్ ప్రజల మనస్సులో చెరిగిపోని ముద్ర వేశారు.
 
ఎంతోమంది రాజకీయ నేతలు ఉన్నా ప్రజల మనస్సులను గుర్తు పెట్టుకుని పథకాలు అమలు చేసే నేతలు కొంతమంది ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్ మహా నేత కాగా ఈ జనరేషన్ కు చెందిన వాళ్లు సైతం ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. సీనియర్ ఎన్టీఆర్ పేరు బ్రాండ్ గా మారిపోగా ఈ బ్రాండ్ చెక్కు చెదరని బ్రాండ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం అమలవుతున్న ఎన్నో పథకాలకు ఎన్టీఆర్ స్పూర్తి అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: