ఐదేళ్ళలో ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు ఖర్చు చేసారంటే ఏడాదికి ఈ ఖర్చు రూ.72 లక్షలు... నెలకు దాదాపు రూ.6 లక్షలు... రోజుకు దాదాపు రూ.20 వేలు. ఈ లెక్కలను బట్టి ఐదేళ్లలో తాడేపల్లి నివాసానికి 18 లక్షల ఎగ్ పఫ్స్ వెళ్లాయి... అంటే రోజుకు 993 ఎగ్ పఫ్స్ తిన్నారన్నమాట. ఇలా కేవలం తాడేపల్లిలో ఎగ్ పఫ్స్ కోసమే జగన్ సర్కార్ ఇంత ఖర్చు చేసారా..! అంటూ ఆశ్చర్యపోతున్నారు.వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుండి పరిపాలనా వ్యవహారాలు చూసుకున్నారా లేక ఎగ్ పఫ్స్ తినడమే పనిగా పెట్టుకున్నారా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ఎగ్ పఫ్ తింటున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎగ్ పఫ్ సీఎం అంటూ జగన్ ను పేర్కొంటూ టిడిపి అనుకూల సోషల్ మీడియాల్లో పోస్టులు వెలుస్తున్నాయి. ఈ వార్తను తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి.అధికారం కోల్పోతే ఇలాంటి వార్తలు చాలా వినాల్సి వస్తుంది. గతంలో 2019లో వై ఎస్ జగన్ అధికారం చేపట్టాక చంద్రబాబు తన నివాసంలో ఎలుకలు పట్టడానికి భారీ మొత్తంలో ఖర్చు చేసారని తీవ్రస్థాయిలో అసెంబ్లీలో విమర్శలు చేసారు. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది, వైసీపీ ని టార్గెట్ చేస్తూ ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. అధికారం వచ్చాక జగన్ సీఎం కార్యాలయం ఫుర్నిచర్ ను కూడా తన ఇంటి కోసం వాడుకున్నారని టీడీపీ లీడర్లు అన్నసంగతి తెలిసిందే.
ఐదేళ్ళలో ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు ఖర్చు చేసారంటే ఏడాదికి ఈ ఖర్చు రూ.72 లక్షలు... నెలకు దాదాపు రూ.6 లక్షలు... రోజుకు దాదాపు రూ.20 వేలు. ఈ లెక్కలను బట్టి ఐదేళ్లలో తాడేపల్లి నివాసానికి 18 లక్షల ఎగ్ పఫ్స్ వెళ్లాయి... అంటే రోజుకు 993 ఎగ్ పఫ్స్ తిన్నారన్నమాట. ఇలా కేవలం తాడేపల్లిలో ఎగ్ పఫ్స్ కోసమే జగన్ సర్కార్ ఇంత ఖర్చు చేసారా..! అంటూ ఆశ్చర్యపోతున్నారు.వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుండి పరిపాలనా వ్యవహారాలు చూసుకున్నారా లేక ఎగ్ పఫ్స్ తినడమే పనిగా పెట్టుకున్నారా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ఎగ్ పఫ్ తింటున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎగ్ పఫ్ సీఎం అంటూ జగన్ ను పేర్కొంటూ టిడిపి అనుకూల సోషల్ మీడియాల్లో పోస్టులు వెలుస్తున్నాయి. ఈ వార్తను తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి.అధికారం కోల్పోతే ఇలాంటి వార్తలు చాలా వినాల్సి వస్తుంది. గతంలో 2019లో వై ఎస్ జగన్ అధికారం చేపట్టాక చంద్రబాబు తన నివాసంలో ఎలుకలు పట్టడానికి భారీ మొత్తంలో ఖర్చు చేసారని తీవ్రస్థాయిలో అసెంబ్లీలో విమర్శలు చేసారు. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది, వైసీపీ ని టార్గెట్ చేస్తూ ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. అధికారం వచ్చాక జగన్ సీఎం కార్యాలయం ఫుర్నిచర్ ను కూడా తన ఇంటి కోసం వాడుకున్నారని టీడీపీ లీడర్లు అన్నసంగతి తెలిసిందే.