-ఓటుకు నోటు కేసులో రేవంత్ ని ఇరిగించారా.?
- సీఎం రేవంత్ రెడ్డి కెరియర్ లోనే మాయని మచ్చ.!


 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారో  అప్పటినుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటూ వచ్చింది.  చివరికి అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు సవాల్ విసిరాడు. నేను సీఎం అయిన తర్వాతే ఏదైనా మాట్లాడతానని అన్నాడు.  ఆయన సీఎం అనే పదాన్ని ఎప్పుడైతే నోట్లో నుంచి పలికారో అదే దిశలో ప్లాన్ ప్రకారం వెళ్లి చివరికి తెలంగాణ రాష్ట్ర మూడవ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అలా తాను చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన రాజకీయ జీవితంలో ఒకే ఒక మాయని మచ్చ ఉంది.. అదే ఓటుకు నోటు కేసు. ఈ ఒక్కటి తప్ప ఆయన జీవితాన్ని నిందించడానికి ఎలాంటి విషయాలు కూడా లేవు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 ఓటుకు నోటు:
 సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసు అనేది 2015 మే లో జరిగింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టిడిపి అభ్యర్థికి ఓటు వేయడం కోసం  నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు  రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వాళ్లు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా  ఏసిబి విడుదల చేసింది. ఈ వీడియోలో ఒక బ్యాగులోని నోట్ల కట్టలతో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డిని  పోలీసుల అరెస్టు చేశారు. పది రోజులు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు.


వాస్తవానికి కేసులో చంద్రబాబు నిందితుడు అంటూ వైసీపీ, టీఆర్ఎస్ ఆరోపిస్తూ వచ్చింది. కానీ దర్యాప్తు సంస్థ చంద్రబాబు పేరుని ఇందులో చేర్చలేదు. ఈ కేసులో భాగంగా మట్టయ్య అనే వ్యక్తి  2015 మే 28న స్టీఫెన్ సన్ ను కలిసి టిడిపి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే నగదు ఇస్తామని తెలియజేశారు. ఈ ఓటుకు డబ్బు తీసుకోవడం తప్పుగా భావించిన స్టీఫెన్ సన్  సీక్రెట్ గా ఏసీబీ అధికారులకు చెప్పారు. ఈయన ఓటు కోసం రేవంత్ రెడ్డిపార్టీ నేత సుభాష్టియన్ రంగంలోకి దిగి  మే 30వ తేదీన వీరిద్దరూ కలిసి స్టీఫెన్ సన్ నివాసానికి వెళ్లి డీల్ మాట్లాడారు. చివరికి మే 31వ తేదీన స్టీఫెన్ సనుకు రేవంత్ రెడ్డి అందజేసే ప్రయత్నం చేయగా  ఇప్పటికే అప్రమత్తంగా ఉన్న ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని పట్టుకున్నారు. ఈ విధంగా ఓటుకు నోటు కేసు అప్పటినుంచి రేవంత్ రెడ్డి చుట్టే తిరుగుతోంది. ఈ ఒక్క వ్యవహారం తప్ప రేవంత్ రెడ్డి ఏ వ్యవహారంలో కూడా నిందితుడిగా లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: