* బూతుల మంత్రిగా కొడాలికి పేరు
* చంద్రబాబు కుటుంబాన్ని దారుణంగా తిట్టిన కొడాలి నాని
* మీడియా ముందుకు వస్తే అన్ని పచ్చి బూతులే
*గుడివాడలో దారుణ ఓటమి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి.. ఎవరు ఊహించని విధంగా ఓడిపోవడం జరిగింది.  కొంతమంది వైసీపీ నేతలు చేసిన తప్పిదాల వల్ల జగన్మోహన్ రెడ్డి కొంప మునిగింది. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు కేవలం 14 స్థానాలకే సరి పెట్టుకోవాల్సి వచ్చింది వైసిపి పార్టీ. అటు ఎంపీ ఎన్నికల్లో కూడా నాలుగు స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది.


అయితే మరోసారి అధికారంలోకి వస్తా అని అనుకున్న.. జగన్మోహన్ రెడ్డిని నట్టేట ముంచింది కొంతమంది వైసీపీ నేతలే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో కొడాలి నాని ఒకరు.దాదాపు గుడివాడ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు కొడాలి నాని విజయం సాధించారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కొడాలి నాని.. వైసీపీలో చేరిన తర్వాత రెండు సార్లు విజయం సాధించారు.


2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కొడాలి నాని. అయితే వైసీపీ లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం  పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని దారుణంగా తిట్టడం మొదలుపెట్టారు కొడాలి నాని.  దానికి జగన్మోహన్ రెడ్డి చిలిపి నవ్వులతో.. కొడాలికి మరింత బూస్ట్ ఇచ్చారు.

ముఖ్యంగా నారా లోకేష్ పుట్టుకను, భువనేశ్వరుని అవమానించడం లాంటివి... కొడాలి నాని చేయడం జరిగిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో కొడాలి నాని బూతుల మంత్రిగా మారిపోయాడని కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే ఈ బూతుల నాయకులు తమకు వద్దని ఏపీ ఓటర్లు డిసైడ్ అయి... వైసీపీని ఓడించినట్లు కూడా కొంతమంది అంటున్నారు. ఇక నైనా జగన్ ఇలాంటి వారిని దూరం పెట్టాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: