ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ప్రస్తుతం వైసీపీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. అయితే తన పార్టీని మళ్ళీ ప్రక్షాళన చేసేందుకు జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు. బెంగళూరులో ఉంటూనే... 2029 లో వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే.. వైసిపి కోసం పనిచేసేందుకు కొత్త టీం ను రెడీ చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి.


 
కర్ణాటకలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో... కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు సునీల్ కనుగోలు. ప్రశాంత్ కిషోర్ టీం నుంచి బయటికి వచ్చి... ప్రస్తుతం ఇండియాలోనే... ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా సునీల్  కనుకోలు గుర్తింపు తెచ్చుకున్నారు. సునీల్ కనుగోలు కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ... అధికారంలోకి వచ్చింది అన్న సంగతి అందరికీ తెలిసిందే.

 

ప్రత్యర్థులను బురిడీ కొట్టించి.. తాను పనిచేస్తున్న పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో సునీల్ కనుగోలు ను మించిన వారు ఎవరూ లేరు. అయితే ప్రస్తుతం వైసీపీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైన నేపథ్యంలో... సునీల్ కనుగోలు  అవసరం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇప్పటికే సునీల్ కనుగోలు  ను కలిసి ఎందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారట.


బెంగళూరుకు కూడా రావాలని సునీల్ కనుగోలుకు ఆఫర్ ఇచ్చారట. 2029లో... వైసిపి మళ్లీ అధికారంలోకి వచ్చి దాన ముఖ్యమంత్రి అయ్యాల పని చేయాలని... సునీల్ కనుగోలుకు  సూచించారు.ఇక... దీనికోసం సునీల్ కనుగోలుకు భారీ మొత్తంలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వబోతున్నారని కూడా సమాచారం. ఇక అతి త్వరలోనే ఈ ఇద్దరి మీటింగ్ బెంగళూరులోని ప్యాలెస్ లో జరగనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సునీల్  కనుకోలు మధ్య కీలక ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.  మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: