- మూడు రాష్ట్రాల్లో తిరుగులేని లీడర్ గా ఎదిగిన రోజా.
- సోషల్ మీడియాలో కూడా టాప్.
- ట్రోలింగ్ లో నెంబర్ వన్!


 రోజా తెలుగు సినిమా ప్రపంచంలో  విరబూసిన రోజాలా ఎంతో పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో నటించింది. అంతేకాదు  లేడీ ఓరియంటెడ్  పాత్రల్లో కూడా హీరోలతో సమానంగా చేసి అదరహో అనిపించింది రోజా. అలాంటి ఈమె  రంగుల కళా ప్రపంచం నుంచి రాజకీయ  కళా ప్రపంచంలోకి వచ్చింది.  ఇక్కడ కూడా అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంత్రి స్థాయి దాకా ఎదిగింది. అలాంటి రోజా సినిమాల్లో ఉన్నప్పటి నుంచే  సోషల్ మీడియాలో స్టార్. ఏదో ఒక రకంగా రోజా మీద రోజు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆమెకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిందని చెప్పవచ్చు. అలాంటి రోజా సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తించేది, ఆమెపై ట్రోలింగ్ ఎలా జరిగేవి రాజకీయ ప్రస్థానం ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 ట్రోలింగ్ రోజా :
 రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి . కానీ ఈ పేరు చెప్తే ఎవరూ గుర్తుపట్టారు. కానీ ఆర్కే రోజా సెల్వమణి అంటే అందరూ గుర్తుపట్టేస్తారు. తిరుపతి దగ్గరలోని చిన్న పల్లెటూరులో పుట్టిన రోజా తెలుగు, తమిళ, భాషల్లో  ఎన్నో చిత్రాల్లో నటించారు. అలాంటి ఈమెను తమిళ సినిమా దర్శకుడు సెలవమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలాంటి రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కీలకమైన స్థాయికి ఎదిగింది. తనను సినిమాలకు పరిచయం చేసిన శివప్రసాద్ భరోసాతో  రాజకీయాల్లోకి వచ్చింది. అంటే ఆమె రాజకీయాల్లో పోటీ చేద్దామని రాలేదు టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి ఆమె వచ్చింది. ప్రచారంలో ఎంతో గుర్తింపు పొందిన రోజా, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారట. ఆ తర్వాత టీడీపీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2004 నగరి నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. కానీ రెండవసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి గల్లా అరుణకుమారి మీద పోటీ చేసి  మళ్లీ ఓడిపోయారు. ఇలా రెండుసార్లు ఆమె ఓడిపోవడానికి టిడిపి కారణమని తెలుసుకున్న రోజా, నియోజకవర్గాల మార్పు వల్లే ఓడిపోయానని గ్రహించింది.  


ముఖ్యంగా ప్రచార సమయంలో ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. ఆమె పేరును ఓర్వలేని టిడిపి నాయకులు ఆమె నియోజకవర్గాన్ని మార్పులు చేయిస్తూ పోటీ చేయిస్తే ఓడిపోతూ వచ్చింది.  చివరికి టిడిపి నుంచి బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో  చేరింది. 2014లో  నగరి నియోజక వర్గం నుంచి పోటీ చేసి గాలి ముద్దుకృష్ణమనాయుడు మీద 800 ఓట్లతో గెలుపొందారు. అలా అసెంబ్లీలో అడుగుపెట్టి అప్పటి టిడిపి ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చింది.  ఆ సమయంలో ఈమె వైసిపి ఫైర్ బ్రాండ్ గా మారింది. సోషల్ మీడియాలో రోజాపై అనేక ట్రోల్స్ వచ్చేసాయి. దీంతో ఈమె పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సమయంలో టిడిపి వారు ఈమెను ఆంటీ, ఐరన్ లెగ్ అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు.  అయినా భయపడని రోజా టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటే వచ్చింది. ఆ తర్వాత రోజా 2019లో మరోసారి పోటీ చేసింది. అప్పుడు కూడా భారీ మెజారిటీతో గెలుపొందింది. సమయంలో జగన్ కూడా అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో రోజాకు మంత్రి పదవి కూడా దక్కింది. సోషల్ మీడియాలో స్టార్ గా ఎదిగిన రోజా, తనసొంత జీవితంలో కూడా స్టార్ అయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: