- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) .

వైసీపీలో ఏదో జరగబోతుందని ఆ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అది ఏంటి అన్నది ? చాలామందికి క్లారిటీ లేదు .. జగన్ వచ్చే నెలలో లండన్ వెళ్లే ప్రయత్నాలలో ఉన్నారు. ఆయన కుమార్తెలు చదువు ఎప్పుడో ? పూర్తయింది ... చదువుకుంటున్న కుమార్తెను చూడడానికని పిటిషన్ లో వేసి అనుమతి తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్టు టాక్ ? జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ గట్టిగా వాదించినా పర్మిషన్ వస్తుందన్న పుకార్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా సిబిఐ కోర్టు జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తుందని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. అయితే ఈసారి ఫ్లైట్ ఎక్కటానికి జగన్ ఒకటికి రెండుసార్లు ఆలోచించే అవకాశం ఉందని చెబుతున్నారు.


దీనికి ప్ర‌ధాన‌ కారణం తాను ఫ్లైట్ ఎత్తే ఇక్కడ పార్టీలో ఏం జరుగుతుందో ? తెలియని గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. జగన్ అందుబాటులో లేరని తెలిసిన తర్వాత వైసిపి రాజ్యసభ సభ్యులు ఎవరి దారికి వెళతారో ... ఎవరి టచ్లోకి వెళతారో ? అన్న అనుమానం జగన్కు ఉంది. జగన్ కాకుండా మిగిలిన పదిమంది ఎమ్మెల్యేలు ఎవరి నాయకత్వంలోకి వెళ్తారో ? అంచనా వేయ‌డం కష్టం. తాజాగా బొత్స సత్యనారాయణ రాజకీయం వైసిపి నేతలని కంగారు పెడుతోందట. ఆయనకు అనవసరంగా ఎమ్మెల్సీ ఇచ్చామా ? ఆ స్థానం వదిలేసుకున్న బాగుండేదేమో అనుకుంటున్నారట.


ఇప్పుడు ఆయన మండలి లో ప్రతిపక్ష నేత ... ప్రభుత్వం వద్ద ఆయ‌న‌కు త‌న సీనియార్టీ నేప‌థ్యం లో పలుకుబడి ఉంటుంది. అందుకే బొత్స‌ ఏదైనా చేసే సమర్థత కలిగిన నేత అని ... ఆయనకు చాలా ప్లాన్లు ఉన్నాయని జగన్ ఫ్లైట్ ఎక్కిన తర్వాతే ఆయన అసలు సినిమా చూపిస్తాడని వైసీపీ నేతలకు బొత్స విశ్వరూపం చూపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: