- ఉమ్మడి వరంగల్ లో తిరుగులేని నేత.
- పార్టీలు మారిన ఫలితాలు మాత్రం మారలే.
- రాజకీయ అవసరాల కోసం కార్యకర్తలపై దెబ్బ.!

 ప్రస్తుత కాలంలో చాలామంది పొలిటీషియన్స్ వారి పదవిని, పరపతిని కాపాడుకోవడం కోసం ఎలాంటి పనులైన చేయడానికి వెనకాడటం లేదు. ముఖ్యంగా పార్టీలు మారుతూ పరపతిని కాపాడుకుంటూ ఏ పార్టీలోకి వెళ్లిన పదవులు పొందే నేతల్లో  ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఒకరు. ఈ విధంగా పార్టీలు మారుతూ తనను నమ్ముకుని ఉన్నటువంటి ఎంతో మంది కార్యకర్తల చెవిలో పువ్వులు పెట్టి, విలాసాల అనుభవిస్తున్న వారిలో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఒకరని చెప్పుకోవచ్చు.  అలాంటి ఎర్రబెల్లి ఏ పార్టీలో చేరారు, ఏ ఏ పదవులు అలంకరించారు అనే వివరాలు చూద్దాం..

 పార్టీల మార్పే కలిసొచ్చేనా?
తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఈ నేత,  ఆ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఉద్యమ పార్టీ ద్వారా తన మంత్రి కల నెరవేర్చుకున్న క్రియాశీలక రాజకీయ నాయకుడు ఎర్రబెల్లి. 1956 జూలై 4న వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామంలో ఎర్రబెల్లి జగన్నాధరావు ఆదిలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఈయన మొదటిసారి 1982లో రాజకీయాల్లో చేశారు. 1983 సాధారణ ఎన్నికల్లో మొదటిసారి టిడిపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన 1994, 1999, 2004 ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పటినుంచి పాలకుర్తి నియోజకవర్గం నుంచి 2009, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా చేశారు. మొదట్లో ఎన్టీఆర్ పార్టీలో చేరినప్పుడు 20,000 మందితో వరంగల్లో సభ పెట్టి ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు. 


అదే సంవత్సరం తెలుగుదేశం పార్టీ జిల్లా కన్వీనర్ గా కూడా పనిచేశారు. జిల్లా కార్యదర్శిగా, వర్ధన్నపేట నియోజకవర్గ  బాధ్యతలు నిర్వహించారు. 1987లో కల్లెడ సొసైటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం వరంగల్ డీసీసీబీ బ్యాంకు చైర్మన్ గాను పదవి బాధ్యతలు చేపట్టారు. 1997లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలో టీడీపీ నేతగా కీలకంగా ఎదిగిన ఎర్రబెల్లి దయాకర్ రావు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇదే తరుణంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో పాలకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది కేసీఆర్ మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా ఓటమి ఎరుగని నేతగా ఎదిగినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు 2023 ఎలక్షన్స్ లో  మళ్లీ  టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి చేతులు   ఓటమి పాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: