ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్న కొందరు మాత్రం బాగా హైలైట్ అవుతున్నారు. వీరిలో హోం మంత్రి వంగలపూడి అనితతో పాటు కడప రెడ్డమ్మ బాగా వార్తల్లో ఉంటున్నారు. కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి దూకుడు మామూలుగా లేదు. అస‌లు వైసీపీ కంచుకోట అయిన క‌డ‌ప లో ఆమె పోటీ చేయ‌డం.. ఘ‌న‌విజ‌యం సాధించ‌డ‌మే ఓ హైలెట్‌. సోష‌ల్ మీడియాను బాగా వాడుకుని క‌డ‌ప రెడ్డ‌మ్మ సంచ‌ల‌న విజ‌యం సాధించి ఇప్పుడే అదే సోష‌ల్ మీడియాతో బాగా హైలెట్ అవుతున్నారు. ఆమె నిత్యం ఏదో ఒక సంచలన విషయాలతో వార్తల్లో ఉంటున్నారు.


కడప నగరంలో ఆమె వచ్చాక రాజకీయం బాగా వేడెక్కుతుంది. తాజాగా మీడియా సమావేశంలో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కడప నగరంలో గుండాలు ... కిరాయి దాదాలు అనుకునే వాళ్లంతా సాయంత్రం వేళలో రోడ్ల మీదకు వచ్చి కుర్చీలు వేసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ... ఇలాంటి వాళ్లు అందరికీ చిన్న విన్నపం అంటూ ఆమె కామెంట్ చేశారు. ఇలా చేసేవారు అలాంటి చేష్టలు మానుకుని మీ ఇళ్లల్లో కుర్చీలు వేసుకుని కూర్చుండి మీ మీటింగ్లు మీ ఇళ్లలో పెట్టుకోండి ... వీధుల్లోకి వచ్చి పెద్ద పోటుగాడులా ఫీల్ అయితే వీపులు విమానం మాత్రం మోగుతాయి అంటూ వారిని ఇచ్చారు.


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారం చలా ఇస్తుంది టిడిపినే.. ఆ పార్టీలో జనసేన - బిజెపి పార్టీలు కూడా భాగస్వామిగా ఉన్నాయి. ఇప్పటికి కడపలో వైసీపీకి చెందిన కొందరు నేతలు గుండాయిజం దాదాగిరి ప్రదర్శిస్తున్నారట. వారు సెటిల్మెంట్లు చేయాలని చూస్తున్నారట. దాంతోపాటు మాధవి రెడ్డి అంటే గిట్టని కడప జిల్లాకు చెందిన కొందరు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి కడపలో అధికారం చాలా ఇస్తున్నారట. ఇది ఆమెకు సహజంగానే కోపం తెప్పిస్తోంది. ప్రతిపక్ష వైసిపి కి చెందిన గుండాగిరి దౌర్జన్యాలు చేసిన నేతలతో పాటు సొంత పార్టీలో ల్యాండ్ సెటిల్మెంట్లు ఇతర సెటిల్మెంట్లు చేసే వాళ్లను దృష్టిలో పెట్టుకుని కడప రెడ్డమ్మ అదిరిపోయే మాస్ వార్నింగ్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా కడప రెడ్డమ్మ వార్నింగ్ అధికార పార్టీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp