ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తణుకు అన్న క్యాంటీన్... వివాదం కాస్త మెగా కుటుంబం పైకి వెళ్ళింది. ఈ అన్న క్యాంటీన్ల వివాదం పై వైసీపీ నేతలు జోరుగా... సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తణుకు అన్న క్యాంటీన్లో అపరిశుభ్రమైన మురికి నీటిలో .. ప్లేట్లను కడుగుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో వైరల్ కాగానే వెంటనే వైసీపీ సోషల్ మీడియా కూడా అలర్ట్ అయింది.

 

చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు వైసిపి నేతలు. అయితే ఈ తరుణంలోనే వైసిపి నేత డాక్టర్  ప్రదీప్ రెడ్డి చింత... సోషల్ మీడియాలో ఈ కథనంపై కౌంటర్లు ఇచ్చారు. అంతేకాదు మెగా హీరో సాయిధరమ్ తేజ్ ను ఈ వివాదంలోకి లాగారు. గతంలో ఏపీలో జరుగుతున్న అన్యాయంపై... స్పందించిన సాయి ధరమ్ తేజ్...  అన్నా క్యాంటీన్ల పరిశుభ్రతపై ఎందుకు స్పందించడం లేదని.. ఆగ్రహించారు.

 

వైసిపి నేత ప్రదీప్ పెట్టిన పోస్ట్ కు వెంటనే స్పందించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్...  మీరు ఎక్కడ ఉంటారు సార్ అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా.. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎగ్ పఫ్  కుంభకోణం జరిగిందని సాయి ధరంతేజ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ ఎగ్ పఫ్ లో మీరు ఎంత తిన్నారు ప్రదీప్ అంటూ సాయి ధరమ్ తేజ్ చురకలు అంటించారు.


ఇక.. అక్కడి నుంచి వైసీపీ కార్యకర్తలు అలాగే నేతలు సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ పై పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దమ్ముంటే.. జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో...  జరిగిన ఎగ్ పఫ్ కుంభకోణం పై ఆధారాలు బయట పెట్టాలని సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు వైసిపి నేతలు. అయితే దీనికి సాయి ధరంతేజ్ ఎక్కడ కూడా ఆన్సర్ ఇవ్వకుండా... తప్పించుకున్నారు.  సాయి ధరంతేజ్ ఆన్సర్ ఇవ్వకపోవడంతో వైసిపి నేతలు ఆయనను మరింత ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: