ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి నేతల బాగోతాలు  ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.ఏపీలో వైసిపి పార్టీ ఓటమి పాలు అయిన తర్వాత... ఆ నేతలను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం కూటమి... చాలా ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు కేసులు పెట్టి మరి వైసీపీ నేతలను ఇబ్బందులు పెడుతోంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. అదే సమయంలో వైసీపీ నేతలు చేసిన చాలా తప్పిదాలు కూడా బయటకు వస్తున్నాయి.


మొన్నటి వరకు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు  వీడియో కాల్ వ్యవహారం కూడా రచ్చ చేసింది. అయితే తాజాగా వైసిపి నేతల కామ వాంఛ... టాలీవుడ్ ఇండస్ట్రీ ని వదిలేసి బాలీవుడ్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటిని రూమ్లో బంధించి మరి టార్చర్ పెట్టారట వైసీపీ నేతలు. అయితే దీనికి సంబంధించిన ఓ వార్త ఎల్లో మీడియాలో నిన్నటి నుంచి వస్తుంది.


ఈ ఇష్యూ ని ఒకసారి పరిశీలించినట్లయితే...ముంబైకి చెందిన ఓ నటిని..విజయవాడకు రప్పించి... ఓ వైసిపి కీలక నేత గెస్ట్ హౌస్ లో బంధించి మరి టార్చర్ పెట్టాడట. వైసిపి నేత అయిన ఓ పారిశ్రామికవేత్త కుమారుడితో... ఆ ముంబై హీరోయిన్ ప్రేమలో ఉందని కూడా సమాచారం. అయితే ఆ బడా వైసిపి నేత కుమారుడి... వ్యవహారం తండ్రికి తెలిసిందట. దీంతో ఆ బాలీవుడ్ బ్యూటీని... మర్చిపోవాలని కొడుకును ఇబ్బంది పెట్టాడట. అయినప్పటికీ వారి వ్యవహారం సద్దుమనగలేదట. దీంతో ఆ బ్యూటీని విజయవాడకు పిలిపించి మరీ టార్చర్ చేశారట. రూమ్లో బంధించి  వేదించారట.


ఈ వ్యవహారం అంతా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిందట. అంతే కాదు ఈ వ్యవహారంలో.. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ నేత కూడా.. ఉన్నారని వార్తలొస్తున్నాయి.  ఇక ప్రేమ వ్యవహారం, విజయవాడలో జరిగిన ఇష్యూ మర్చిపోవాలని.. ఆ హీరోయిన్ కు 5 కోట్ల ఆఫర్ కూడా ఇచ్చారట. అయినప్పటికీ ఆ హీరోయిన్ రాజీ పడలేదని సమాచారం. దీంతో ఓ ఐపీఎస్ ఆఫీసర్.. అప్పటి వైసిపి నేతలు చెప్పినట్లుగా విని... సదర్ హీరోయిన్ పై చీటింగ్ కేసు పెట్టారట. వైసిపి నేతలను హనీ ట్రాప్ బ్లాక్ మెయిల్ చేస్తోందని.. ఆమెను ఇరికించారట. ప్రస్తుతం ఈ విషయాన్ని ఎల్లో మీడియా బాగా ప్రచారం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: