పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు భారీ షాక్ తగిలింది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు అంబటి రాంబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళను అణ‌గతొక్కడంతోపాటు.. చివరకు సొంత పార్టీ వైసిపి నాయకులను కూడా ఆయన రకరకాల ఇబ్బందులకు గురి చేశారు. ఒకానొక దశలో విసిగిపోయిన వైసిపి నాయకులు.. అంబటి రాంబాబుకు సీటు ఇస్తే.. తాము ఓడిస్తామని చెప్పారు. జగన్ కూడా అంబటికి సీటు ఇవ్వ‌రనే అందరూ అనుకున్నారు. చివర్లో అంబటి బతిమిలాడుకోవడంతోపాటు.. గుంటూరు జిల్లాలో ఉన్న సామాజిక సమీకరణలపరంగా జగన్ అంబటికి సీటు ఇవ్వక తప్పలేదు.


పార్టీ ఓడిపోయాక నియోజకవర్గంలో అంబటి పెద్ద పెద్ద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా అంబటి ప్రధాన‌నుచరులుగా ముద్ర పడినవారు అందరూ స్థానిక ఎమ్మెల్యే.. టిడిపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కు జై కొడుతున్నారు. నక‌రికల్లు మాజీ జడ్పిటిసి అంబటి ప్రధాన అనుచరుడు రాఘవరెడ్డి.. టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. రాఘవరెడ్డి తో పాటు ఆయన అనుచరుడు కొండా మురళీధర్ రెడ్డి.. అలియాస్ కేబుల్ మురళి కూడా కన్నా సమక్షంలో టిడిపిలో చేరుతున్నారు. పైగా వీళ్లంతా వైసీపీని జగన్‌ను గత పదిహేడేళ్ళుగా అభిమానిస్తున్న నేతలు కావడం విశేషం. వీరంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం కూడా ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన విషయం.


అంబటి రాంబాబు తీరుతో విసిగిపోయి.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు తమ పూర్తిగా పక్కన పెట్టడంతో.. ఇప్పుడు వారంతా టిడిపిలోకి వెళ్ళిపోతున్నారు. ఇక నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ తన రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించి వైసీపీలో ఉన్న కీలక నేతలు అందరిని టిడిపిలో చేర్చుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో అయిన తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. నియోజకవర్గంలో అసలు వైసీపీకి చోటు లేకుండా చేయాలని ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తూ దూసుకుపోతున్నారు. ఏది ఏమైనా అంబటి రాంబాబును.. కన్నా పూర్తిగా దెబ్బ కొట్టడం కాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: