తాడిపత్రిలో రాజకీయాలు అంటే ఎప్పుడూ హీటెక్కించేలా ఉంటాయి.. ముఖ్యంగా అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా జెసి కుటుంబం చేసే హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఇటీవలే జేసి అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారం పక్షంలో ఉండి తామే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు వెళ్లి మరి టిడిపి శ్రేణులతో బైఠాయించినట్లుగా  తెలుస్తోంది. మరి వీటి గురించి పూర్తిగా చూడు.


గత కొద్ది రోజుల నుంచి తాడిపత్రి చుట్టు పరిసరాలలో ఉండేటువంటి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఈ రవాణాను అరికట్టేందుకు జెసి కుటుంబం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గత కొద్దిరోజులుగా జెసి ప్రభాకర్ రెడ్డి కూడా ఈ విషయం పైన మాట్లాడుతూనే ఉన్నారు. తమ నేతలు ఇలా చేస్తున్నారని కూడా తెలిపారు. కొన్ని గంటల క్రితం ఇసుక అక్రమ రవాణా ఆపాలనుటూ ఆస్మిత్ రెడ్డి సిఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేయగా నువ్వు ఎవరో నాకు చెప్పడానికి అంటూ మాట్లాడారట. ఈ విషయం అస్మిత్ రెడ్డిని చాలా బాధ కలిగించింది అంటూ తెలుపుతున్నారు.



ఒక ప్రజాప్రతినిధికి ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా అంటూ లక్ష్మీకాంత్ రెడ్డి ని నిలదీశారు.. ఒక ఎమ్మెల్యేతో సిఐ ఇలా మాట్లాడితే సామాన్య ప్రజలతో ఎలా మాట్లాడతారు అనే విషయం మనమే అర్థం చేసుకోవాలని కూడా తెలియజేశారు. అయితే ఇప్పటికే సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి పైన చాలా ఫిర్యాదులు ఉన్నాయని కూడా తెలిపారు. ఆయన పైన చర్యలు తీసుకోకపోతే తాడిపత్రి ప్రజలకు అన్యాయం జరిగినట్టుగానే ఉంటుంది అంటే అస్మిత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా నియోజకవర్గాలలో ఇసుక ఆక్రమ రవాణా చేస్తున్నారని వాటిని అరికట్టేందుకు పోలీసులు చెప్పిన అసలు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. అక్రమ రవాణ చేస్తున్న టిప్పర్లను పోలీసులకు పట్టిస్తే తమ వాళ్ళని అరెస్టు చేస్తున్నారని కేసులు పెడుతున్నారని హాస్పిటల్ రెడ్డి నిన్నటి రోజు తాడిపత్రిలో పోలీస్ స్టేషన్ నందు ధర్నా చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: