అల్లు వర్సెస్ మెగా కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2024 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బన్నీ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. తన సొంత మేనమామకు సపోర్ట్ చేయకుండా తన స్నేహితుడికి సపోర్ట్ చేశారు. కానీ అక్కడ నుండి అతని విజయం సాధించలేదు. అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో మెగా కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. సోషల్ మీడియాలో మెగా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు నాగబాబు లేదా సాయిధరమ్ తేజ్ ఎవరో ఒకరు పరోక్షంగా బన్నీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

అదే సమయంలో సోషల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య వివాదం రాజుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి ముందు అల్లు అర్జున్ పిల్ల బచ్చా అంటూ కొంతమంది మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఏదో ఒక రకంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా....తాజాగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్... అల్లు అర్జున్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఆయన మీడియాతో మాట్లాడుతూ.... అల్లు అర్జున్ కు పెద్దగా అభిమానులు ఉండరని, అతనికి ఉన్న వారంతా మెగా అభిమానులులే. మెగా అభిమానులని ఆయన అల్లు అర్జున్ అభిమానులని ఊహించుకుంటున్నాడని కామెంట్ చేశారు. అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్నారనే విషయం కూడా తనకు తెలియదంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇక్కడ ఉన్నది చిరంజీవి అభిమానులు. మెగా అభిమానులేనని, అది గుర్తించుకోవాలని, అల్లు అర్జున్ తన స్థాయిని మరిచిపోయి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డాడు.


జనసేన పార్టీ మొత్తం పోటీ చేసిన 21 స్థానాల్లో విజయాన్ని సాధించామని.....తమకు అల్లు అర్జున్ అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయన వైసీపీ అభ్యర్థికి మద్దతునిచ్చారని, స్వయంగా వెళ్లి పోటీ చేశారని, ఫలితం ఏమైందనే విషయాన్ని అల్లు అర్జున్ గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని హితవు పలికారు. అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: