* మల్లెమాలపై ఆర్పీ షాకింగ్ వ్యాఖ్యలు

* అన్నం పెట్టిన చెయ్యినే కోరుకుతావా సిగ్గు లేదా అంటూ బాబూమోహన్ తీవ్ర విమర్శలు

* ఎంత ఎదిగిన ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుంచుకోవాలి.. మనిషి వేనా అంటూ రెచ్చిపోయిన బాబుమోహన్..!!



ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ఎంతమంది నటినటులకు లైఫ్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎందరో కమెడియన్స్ ఆ షో ద్వారా తమ టాలెంట్ నిరూపించుకొని సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పటికీ జబర్దస్త్ షో ఇంత పాపులర్ అవ్వడానికి కారణం ఈ షో పై ప్రేక్షకులలో వున్న క్రేజ్ అని చెప్పొచ్చు. అయితే ఈ షో గురించి కొన్ని కాంట్రవర్శిలు కూడా జరిగాయి. ఈ షో నుంచి బయటకు వచ్చిన కొందరు ఆర్టిస్తులు ఈ షో గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలియజేశారు.. అలా బయటకు వచ్చిన వారిలో కిరాక్ ఆర్పి కూడా ఒకరు.. రామ్ ప్రసాద్ గా జబర్దస్త్ కి వెళ్లిన అతను కిర్రాక్ ఆర్పి గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. తన డిఫరెంట్ స్టైల్ కామెడీతో ఆర్పి బాగా ఫేమస్ అయ్యాడు.మొదట ధన్ రాజ్ టీమ్ లో కంటెస్టెంట్ గా చేసి, తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. కొన్నాళ్ళు టీమ్ లీడర్ గా తన స్కిట్స్ తో ఆడియన్స్ ను బాగా నవ్వించాడు. అయితే అప్పటి వరకు జబర్దస్త్ జడ్జి గా ఉన్న నాగబాబు షో నుండి బయటకు వచ్చేయడంతో ఆయనతో పాటే కిర్రాక్ ఆర్పి కూడా బయటకు వచ్చేసారు. ఆ తరువాత జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది షో లో ఆర్పి చేసాడు.ఇదిలా ఉంటే ఆర్పీ ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో మల్లెమాల సంస్థపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.


 మల్లెమాల సంస్థలో తిండి సరిగా ఉండదని జబర్దస్త్ ద్వారా ఎన్నో కోట్లు సంపాదిస్తున్నా అక్కడ వసతులు సరిగా ఉండవని సరైన తిండి ఉండదని, గౌరవం ఇచ్చేవారు కాదని ఆర్పీ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు.. అయితే ఆర్పీ చేసిన ఈ ఆరోపణలపై ప్రముఖ సీనియర్ కమెడియన్, నటుడు అయిన బాబూమోహన్  ఓ ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆర్పీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..ఆయన మాట్లాడుతూ ఆర్పీ ” జబర్దస్త్ షో లోకి రాకముందు నువ్వెంత ? నీ బతుకెంత? అవకాశాలు లేక చాలా మంది ఆర్టిస్తులు కూటికోసం మలమల మాడుతుంటే నీ అదృష్టం బాగుండి ఇక్కడికి వచ్చావు. వచ్చాక నిన్ను నలుగురు గుర్తు పట్టేసరికి నీ కళ్ళు కాస్త నెత్తికెక్కాయి. మల్లెమాల సంస్థ ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన సంస్థ..MS రెడ్డి గారు చిత్ర సీమకి తండ్రి లాంటి వారు.. జబర్దస్త్ ను నడిపేది ఆయన కొడుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. అలాంటి ఓ గొప్ప సంస్థ నీకు అన్నం పెట్టింది. ఆ సంస్థపై ఆరోపణలు చేయడానికి నీకు మనసెలా ఒప్పింది....నీకు అస్సలు సిగ్గు లేదు..అన్నం పెట్టిన సంస్థనే విమర్శిస్తావా . ఎంతోమందికి పనిచ్చి అన్నం పెట్టే ఆ సంస్థ ఇంకా పది కాలాల పాటు బాగుండాలి అని కోరుకోవాలి కానీ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు.నాకు సినీ జీవితాన్ని ఇచ్చింది కూడా ఆ సంస్థే. నేను ఈరోజు ఈ స్థాయిలో వున్నానంటే కారణం మల్లెమాల సంస్థ నన్ను పెద్ద స్టార్ ను చేసింది..అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: