పార్టీ వ్యామోహం..సెలబ్రిటీల మధ్య చిచ్చు రేపిందా..!

•కిర్రాక్ ఆర్పి కి పార్టీ పై వ్యామోహం

•అభిమానుల ఆగ్రహానికి గురి..

•పార్టీ వ్యామోహం సెలబ్రిటీల మధ్య చిచ్చు రగిలిస్తోందే..


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

ఈమధ్య కాలంలో ప్రత్యేకించి 2024 ఎన్నికలలో జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనుకున్న పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపారు. అందులో భాగంగానే సెలబ్రిటీలు కొంతమంది రాజకీయ వ్యామోహం కారణంగా ఇతర సెలబ్రిటీలపై విమర్శించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్ పి రాజకీయ వ్యామోహం వల్ల స్టార్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం తర్వాత చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తన స్టేటస్ ఏంటి అనే విషయాన్ని ఆయన గుర్తించకుండా ఏకంగా పాన్ ఇండియా హీరో,  దీనికి తోడు వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయిన అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


అంతేకాదు చాలామంది సెలబ్రిటీలు ఆర్పి పై విమర్శలు చేస్తూ.. నువ్వెంత, నీ బ్రతుకెంత  అంటూ కామెంట్ చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ని తీవ్రస్థాయిలో విమర్శించడంతో అతనిపై చాలామంది కామెంట్ చేశారు. అయినా సరే ఏమాత్రం తగ్గని కిరాక్ ఆర్పి నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వకుండా అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఇదంతా తెరపైకి వచ్చింది.  నిజానికి ఎవరు ఇష్టం వారిది. మరి కిర్రాక్ ఆర్ పీ జనసేనకు సపోర్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్ అని ప్రశ్నించలేదు కదా.. అసలు నువ్వు ఎవరు..? అల్లు అర్జున్ ని టార్గెట్ చేయడానికి అంటూ అల్లు అర్జున్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శించారు.

ముఖ్యంగా ఎవరి వ్యక్తిగత నిర్ణయం వారిది.. కానీ కొంతమంది అతి కి పోయి రాజకీయ పార్టీల వ్యామోహం పైన ఎదుటివారు ఎంతవారు అని ఆలోచించకుండా విచక్షణారహితంగా కామెంట్లు చేస్తూ తర్వాత చిక్కుల్లో పడుతున్నారు.  ఏది ఏమైనా అల్లు అర్జున్ విషయంలో కూడా ఆర్పి దారుణంగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది . ఏది ఏమైనా రాజకీయ పార్టీ వ్యామోహం పైన కిరాక్ ఆర్పి స్థాయిని మరిచిపోయి అల్లు అర్జున్ పై కామెంట్లు చేశారంటూ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: