సినీనటి, వైసిపి మాజీ మంత్రి రోజా గత ఎన్నికలలో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలలో ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు.దీంతో సొంత కార్యక్రమాలలో బిజీగా ఉన్న రోజాని చూసి చాలామంది తెలుగు రాజకీయాలకు స్వస్తి పలికిందని తమిళ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే విధంగా వార్తలయితే వినిపించాయి. అంతేకాకుండా గడిచిన రెండు రోజుల క్రితం తన ట్విట్టర్ నుంచి వైసీపీ ఫోటోని తీసేసారని జగన్ ని అన్ ఫాలో చేశారని కూడా వార్తలు వినిపించాయి.


అయితే ఈ విషయాల పైన స్పందిచని రోజా తాజాగా వైసిపి జగన్మోహన్ రెడ్డి ,భారతి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేసింది. 1996 ఆగస్టు 28న వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా చాలా మంది కుటుంబ సభ్యులు అభిమానులు రాజకీయ ప్రముఖులు సైతం ఈ జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లడిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే రోజా కూడా తన ట్విట్టర్ నుంచి షేర్ చేస్తూ ఎన్ని ఏళ్ళు గడిచినా కూడా చెక్కుచెదరని మీ అనుబంధం ఇలాగే కలకాలం సాగాలని కోరుకుంటున్నాను అన్న, వదినలకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ రోజా ఒక పోస్ట్ షేర్ చేసింది.


దీంతో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల పైన రోజా మరొకసారి చెక్ పెడుతూ ఇలా చేసిందనే విధంగా వైసిపి శ్రేణులు చర్చించుకుంటున్నారు. నగరి నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన రోజు 2024 ఎన్నికలలో భాగంగా చాలా ఘోరంగా ఓడిపోయింది.ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ అనే పేరును కూడా సంపాదించుకున్న రోజా ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ కావాలని తన చుట్టూ ఉన్నవాళ్లే తనని ఓడించారనే విధంగా వార్తలు వినిపించాయి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: