వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఒకప్పుడు ఫ్యామిలీ అంతా ఫుల్ సపోర్ట్ గా ఉండేది. తల్లి, వైఎస్ షర్మిల, బావ బ్రదర్ అనిల్ కుమార్, తల్లి వైయస్ విజయలక్ష్మి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, బాబాయ్ దివంగత వైయస్ వివేకానంద రెడ్డి, మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఇంకా చెప్పాలి.. అంటే జగన్కు ఎన్ని బంధుత్వాలు ఉన్న అందరూ జగన్ వెంట ఉండేవారు. జగన్‌కు వరుసకు బంధువు అయిన టాలీవుడ్ హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కూడా జగన్‌కు ఫుల్ సపోర్ట్ చేసింది. 2019 ఎన్నికల ముందు మోహన్ బాబు.. తన పెద్ద కుమారుడు మంచు విష్ణుతో కలిసి వైసిపి కండువా కప్పుకుని మరి వైసీపీ గెలుపునకు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.


కార్యక్రమంలో తల్లి వైయస్ విజయలక్ష్మి, చెల్లి వైయస్ షర్మిల ఇప్పటికే జగన్‌కు దూరం అయ్యారు. బ్రదర్ అనిల్ తో పాటు.. జగన్ బంధువులలో మోహన్ బాబుతో మొదలుపెట్టి చాలామంది ఇప్పుడు జగన్ వెంట లేరు. ఈ క్రమంలోనే జగన్‌కు అత్యంత సన్నిహితుడు బంధువు అయిన మాజీ మంత్రి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం ఇప్పుడు జగన్‌కు దూరం కానున్నారు. గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న బాలినేని.. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడుతున్నారా ? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పార్టీ నేతలను దూరం పెట్టిందని.. ఈవీఎంల‌ అమలుపై తను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదని వాపోయారు.


కనీసం తన గోడు ఎవరు వినే పరిస్థితిలో కూడా లేరని.. అందుకే ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నానని.. బాలినేని చెప్పారు. తాను జనసేనలోకి వెళుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని.. బహుశా జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారేమో అని బలినేని ధర్మగ‌ర్బంగా వ్యాఖ్యానించారు. అయితే తనకు ప్రజల మద్దతు ఉందని.. తాను ఎవరికి భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. పార్టీ తనను పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా.. తనకు ప్రజల మద్దతు ఉందన్నారు. వారి కోసం తాను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు. ఏదేమైనా బాలినేని కామెంట్లు చూస్తుంటే బాలినేని వైసీపీలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదన్నది క్లారిటీ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: