పశ్చిమ బెంగాల్. తూర్పు ఈశాన్య భారత దేశంలో ఉన్న కీలక రాష్ట్రం. అయితే.. కొన్నాళ్ల కిందట.. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అచ్చం ఇప్పుడు బెంగాల్ లోను అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇక్కడ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. ఎవరో వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని జాతీయ మీడియా కూడా చెబుతోంది. మంగళవారం.. రాష్ట్ర రాజధాని కోల్ కతా  వీధుల్లో రెండే రెండు అంశాలు కనిపించాయి. భీకరమైన బూట్ల చప్పుళ్లతో పరుగులు పెడుతూ.. లాఠీలకు తుపాకులకు పని చెప్పిన పోలీసులు.


రెండోది పోలీసుల బారి నుంచి తప్పించుకుంటూననే సీఎం మమతా బెనర్జీ కి వ్యతిరేకంగా ఉవ్వెత్తున  ఎగిసి పడుతున్న విద్యార్థి లోకం. ఎటు చూసినా ఈ రెండే కనిపించాయి. ఒక్క కోల్ కతాలోనే కాదు. కీలక పట్టణం హౌరా, సహా అనేక ప్రాంతాల్లో పశ్చి బెంగా ఛాత్ర సమాజ్ ఇచ్చిన పిలుపులో భాగంగా విద్యార్థులు రోడ్డెక్కారు. మమతకు వ్యతిరేకంగా ర్యాలీలు తీశారు. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


కొన్ని కొన్ని చోట్ల అయితే మమత రాష్ట్రం వీడిపోవాలంటూ ఫ్లకార్డులు కనిపించడం గమనార్హం. ఈ పరిణామాలు రాష్ట్రాన్ని రోజు రోజంతా అట్టుడికించాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసుల లాఠీ ఛార్జీలతో విద్యార్థులకు రక్తాలు కారాయి. ఒకరిద్దరి తలలు పగలగా చాలా మంది ఎముకలు చిట్టిపోయాయి.


కాగా ఈ ఘటన వెనుక బీజేపీ ఉందని.. ప్రతిపక్షాలు కాంగ్రెస్ , కమ్యూనిస్టు  పార్టీలు(నిన్న మొన్నటి వరకు మమతను తిట్టిపోసిన పార్టీలు) ఆరోపణలు చూస్తుంటే తెర వెనుక ఏదో కుట్ర జరుగుతోందని జాతీయ మీడియా చెబుతున్న మాట. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఇక్కడ పాలన పగ్గాలు చేపట్టాలన్న దిల్లీ పెద్దల వ్యూహానికి విద్యార్థులు పావుగా మారుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్ లోను విద్యార్థుల రగడ.. పొరుగు దేశాల మద్దతుతోనే హసీనా రాజీనామా చేయడం.. దేశం వదిలి పారిపోవడం తెలిసిందే. మరి మమత మొండి ఘటం కావడంతో ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: