ఏపీని ప్రధాన రాజకీయ పార్టీలలో వైసీపీ ఒకటి కాగా ఈ రాజకీయ పార్టీ భారీ షాకిచ్చే దిశగా పలువురు కీలక నేతలు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి నేతల గురించి అంబటి రాంబాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జగన్ కృషి వల్లే పోలవరంకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని అంబటి రాంబాబు వెల్లడించారు.
 
పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు పదేపదే అబద్ధాలు చెబుతున్నాడని ఆయన తెలిపారు. చంద్రబాబు నాకంటే మహానటుడు అని సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయని అంబటి రాంబాబు వెల్లడించారు. జగన్ కు మంచి పేరు రాకుండా బాబు కుట్రలు చేస్తున్నాడని జగన్ హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగంగా జరిగాయని అంబటి తెలిపారు.
 
అందువల్లే ప్రస్తుతం పోలవరం ఫేజ్1 కోసం నిధులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. జగన్ నిధుల కొరకు ఎన్నోసార్లు కేంద్ర పెద్దలను కలవడం జరిగిందని అంబటి వెల్లడించారు. కేంద్రం విడుదల చేసిన నిధులలో జగన్ కృషి ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు తాను చేసిన తప్పులను జగన్ పై రుద్దుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. బాబు అబద్ధాలను మేధావులు, ప్రజలు గుర్తించాలని అంబటి తెలిపారు.
 
మోపిదేవి జగన్ కు సన్నిహితుడని ఆయన పార్టీ మారతారని నేను అనుకోవడం లేదని అంబటి చెప్పుకొచ్చారు. మోపిదేవికి అలాంటి ఆలోచన ఉన్నా వెనక్కు తీసుకోవాలని నేను చెబుతున్నానని ఆయన కామెంట్లు చేశారు. గతంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అంబటి వెల్లడించారు. చంద్రబాబు పొలిటికల్ లైఫ్ అందరికీ తెలిసిందేనని ఆయన తెలిపారు. అధికారం అనేది ఏ పార్టీకి శాశ్వతం కాదని అంబటి వెల్లడించారు. రాజకీయ నేతలు పార్టీలు మారడం సరికాదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అంబటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: