పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరో పుట్టినరోజు కోసం చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఎల్లుండి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పుట్టినరోజు కావడం చేత ఏపీ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజున సెప్టెంబర్ -2 వ తేదీ కావడం చేత ఆంధ్రప్రదేశ్ లో ఉండే గ్రామాలు అన్నీ కూడా శుభ్రం చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సైతం ఈ విషయాన్ని తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో జనసేన ,టిడిపి నాయకులు అంతా కూడా పాల్గొనాలని అలాగే కార్యకర్తలు కూడా పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఇటీవలే నర్సీపట్నం మండలంలో ధర్మసాగరంలో పింఛని పంపిణీ వ్యవహారంలో పాల్గొన్న  అయ్యన్నపాత్రుడు సైతం ఈ విషయాన్ని తెలియజేశారు. ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పింఛినిని పెంపు అమలు చేసిందని కూడా తెలియజేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కచ్చితంగా పెంచినిని పంపిణీ చేస్తామని తెలియజేశారు.


రేపటి రోజున సెప్టెంబర్ ఒకటి అవ్వడం చేత అలాగే ఆదివారం కావడం చేత ఒకరోజు ముందుగానే ఈ పంపిణీ చేయబోతున్నట్లు తెలియజేశారు. ఉదయం 9:30 నిమిషాలకే 80% వరకు పింఛనీ పంపిణీ పూర్తి అయ్యిందని కొత్తగా అర్హులైన వారికి అక్టోబర్ నుంచి వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేశారు. అలాగే అనర్హులుగా ఉన్న వారిని తొలగించేందుకు కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలియజేశారు అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలియజేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరో పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్గా చేయాలని నానా హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో ఇప్పటికే చీరలు కూడా పంపిణీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: