వైసీపీ లో నాయకుల వాదన అంతా ఇప్పుడు అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూనే తిరుగుతూ ఉంది. ఆయన వల్లే పార్టీకి కష్టాలు ఏర్పడ్డాయని.. ఆయన నిర్ణయాలే పార్టీని ముంచేశాయి అని చాలా మంది నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్నికలకు ముందు.. ప్రభుత్వంలో సజ్జల కీ రోల్ పోషించారు. అంతా ఆయన కనుసన్నల్లోనే వ్యవహారాలు సాగాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా సజ్జల చెప్పాల్సిందే.



అంతేకాదు.. నియోజకవర్గాల్లో విభేదాలు, వివాదాలు చోటు చేసుకున్నప్పుడు కూడా పంచాయతీలు చేసింది సజ్జలే. అయితే అప్పట్లో అంటే.. ఆయన మాటకు కట్టుబడో..లేక భయపడో నాయకులు వ్యవహరించారు. కానీ ఇప్పుడు పార్టీలో ఓటమికి కూడా ఆయనే ముఖ్య కారణం అనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ నాయకులను మార్పు చేసిన విషయం తెలిసిందే. సుమారు 85 నియోజకవర్గాల్లో నాయకులను మార్పులు చేర్పులు చేశారు. వేరే వారిని కూడా నియమించారు. ఈ మార్పులకే సజ్జలే కారణం అనే విమర్శ ఉంది.


గుంటూర్ వెస్ట్ లో మద్దాలి గిరి తప్పించడం వెనుక.. సజ్జల కీలక పాత్రపోషించారని అంటారు. దీంతో గిరి ఎన్నికలకు ముందు పొరుగు రాష్ట్రానికి వెళ్లి పోయారు. కనీసం పార్టీ తరఫున కూడా ప్రచారం చేయలేకపోయారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో జరిగింది. అదే విధంగా రాయదుర్గం ఎమ్మెల్యేకు టికెట్ రాకపోవడానికి సజ్జలే కారణం అనే వాదన ఉంది. నెల్లూరు లో కీలక నేతలు దూరం కావడానికి కూడా ఆయనే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు.


ఇలా ఎన్నికలకు ముందు శాసించిన సజ్జలను తప్పించాలని ఇప్పుడు తప్పించాలని కొంతమంది నాయకులు డిమాండ్ చేస్తున్నారు.  కొందరి నాయకుల మాటలను బట్టి చూస్తే సజ్జలతో పాటు మరో ఇద్దరు ముఖ్య నేతలను పక్కన పెట్టాలని జగన్ కు సూచిస్తున్నారు అంట. అయితే ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: