గ్రేటర్ గుంటూరు ఏర్పాటుకు మార్గం సుగ‌మం అవుతోంది. గ్రేట‌ర్ గుంటూరులో కలిసే గ్రామాలు మండ‌లాల వారీగా ఇలా ఉన్నాయి..
మేడికొండూరు: పేరేచర్ల, డోకిపర్రు..
ఫిరంగిపురం: అమీనాబాద్..
చేబ్రోలు: నారాకోడూరు, గొడవర్రు, గుండవరం..
ప్రత్తిపాడు: చిన్న కొండ్రుపాడు, యనమదల, ఈదుల పాలెం..
తాడికొండ: లాం, కంతేరు, దామరపల్లి, గరికపాడు, పొన్నెకల్లు..
వట్టిచెరుకూరు: పుల్లడిగుంట, కొర్నేపాడు, వింజనంపాడు, కుర్నూతల..
పెద్దకాకాని: రామచంద్రపాలెం, నంబూరు, అగతవరప్పాడు, గోళ్లమూడి, కొప్పురావూరు, పెద్దకాకాని, వెలిగండ్ల, వెంకట కృష్ణాపురం..
గుంటూరు: చిన్న పలకలూరు, మల్లవరం, గోర్లవారిపాలెం, జొన్నలగడ్డ, చల్లావారిపాలెం, తురకపాలెం, తోకావారిపాలెం, లాల్ పురం, వెంగళాయపాలెం, దాసుపాలెం, ఓబులు నాయుడుపాలెం..


గుంటూరు గ్రామం మున్సిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు అవుతుంది.. ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో గ్రేటర్ గుంటూరు గా రూపాంతరం చెందనున్నది.. ఈ మేరకు గుంటూరు కార్పొరేషన్ లో ఎనిమిది మండలాల పరిధిలోని 39 గ్రామాలను విలీనం అవ్వనున్నాయి.. గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగవనున్నది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.. ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవి కాలం పూర్తి అయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలుపుతారు.. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక కార్పొరేషన్ పరిధిలో 39 గ్రామాలు... 8 మండలాలు గుంటూరు పరిధిలోకి రానున్నాయి... గుంటూరు రూరల్ మండలం పూర్తిగా ర‌ద్ద‌వుతోంది. ఇక నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు - విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.. ఇప్పటికే స్మార్ట్ సిటీ పథకంలో ఈ రెండు నగరాలకు కేంద్రం రూ:2 వేల కోట్లు మంజూరు చేసింది.


ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రానికి ధీటుగా గ్రేట‌ర్ గుంటూరు తో పాటు విజ‌య‌వాడ ల‌ను క‌లిపి జంట న‌గ‌రాలుగా విస్త‌రించాల‌న్న‌దే ప్ర‌భుత్వ ప్లాన్ గా తెలుస్తోంది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే ఈ జంట న‌గ‌రాల మ‌ధ్య‌లో అభివృద్ధి ఉరుకులు ప‌రుగులు పెడుతోంది. ఏదేమైనా వ‌చ్చే ఐదేళ్ల‌లో ఈ ప్రాంత రూపురేఖ‌లే పూర్తిగా మారిపోనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: