తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. పది సంవత్సరాల అధికారాన్ని కోల్పోవడంతో గులాబీ పార్టీని... కనుకరించే వారే కనిపించడం లేదు. అదే సమయంలో పార్లమెంటు ఎన్నికల్లో జీరో స్థానాలకు గులాబీ పార్టీ పడిపోవడం... కెసిఆర్ కు మరో ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఇక అటు పదిమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కాండవ కప్పుకొని కేసీఆర్కు మరో షాకి ఇచ్చారు. కవిత కేసు, నేతల జంపింగ్ ఇలా వరుసగా గులాబీ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.


అయితే ఇలాంటి నేపథ్యంలో... గులాబీ పార్టీకి ఓ అదిరిపోయే శుభవార్త అందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే గులాబీ పార్టీ కోసం...  సునీల్ కనుగోలు పనిచేయబోతున్నారని సమాచారం అందుతుంది. కర్ణాటకలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సునీల్ కనుగోలు పాత్ర కీలకమైంది. ఆయన లేకపోతే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కచ్చితంగా ఓడిపోయేదని కూడా అందరు చెబుతూ ఉంటారు.


అయితే అలాంటి సునీల్ కనుగోలు... కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. కెసిఆర్ కోసం... పనిచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట.  దీనికోసం గులాబీ పార్టీ నుంచి భారీగానే డబ్బులు తీసుకుంటున్నారట సునీల్ కనుగోలు. అయితే లేటెస్ట్ గా గులాబీ పార్టీ పైన కీలక పోస్ట్ పెట్టారు సునీల్ కొనుగోలు. కెసిఆర్ అలాగే ktr ను పరోక్షంగా పొగుడుతూ ఈ పోస్టు ఉంది.

 

హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు సునీల్ కొనుగోలు. దీంతో కొన్ని కాలనీలు మునిగిపోతున్నాయని తెలిపారు. అయితే హైదరాబాదులో కాలనీలో మునిగిపోతే కేటీఆర్ మరియు కేసీఆర్ను తిడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.  అదే సమయంలో హైదరాబాద్ గురించి ఎవరైనా...  మంచిగా చెప్పుకుంటే చంద్రబాబు వల్ల హైదరాబాద్ డెవలప్ అయిందని కొంతమంది... పోస్ట్లు పెడతారని ఆయన పరోక్షంగా చురకలంటించారు. అయితే సునీల్ చేసిన ఈ పోస్టుతో గులాబీ పార్టీకి ఆయన దగ్గర అవుతున్నారని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: