ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు ఒక ప్రజా ప్రతినిధి వివాదంలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో... టెంప్ట్ అవుతున్న ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు.. వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుని రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతల ఆగడాలు బయటపడుతున్న నేపథ్యంలో తాజాగా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం బాగోతం బయటపడింది. తాజాగా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు సంబంధించిన కొన్ని సీక్రెట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ప్రతి చోటా హాట్ టాపిక్ అవుతున్నాయి.


మత్తుమందు ఇచ్చి తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారని ఓ బాధితురాలు ఆరోపణలులో పేర్కొంది. తనని చెల్లి, చెల్లి అంటూనే దారుణంగా ఇలా లైంగికంగా వాడుకున్నారని ఆరోపిస్తోంది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వీడియోను తాజాగా బాధితురాలు రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే అత్యాచారం చేసిన ఆరోపణలపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధి అయి ఉండి ఇలా దిగజారిపోయి నీచమైన పనులు చేయడం సరికాదని ప్రజలు వాపోతున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా విచారణ చేయాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు.


అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన కోనేటి ఆదిమూలం ఆ తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. ఆ బాధితురాలు టీడీపీ పార్టీ కి చెందిన మహిళ అని సమాచారం అందుతోంది. ఆమె ఓ మీడియాకు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్ కు సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం.. తనను రమ్మన్నాడని ఆమె తెలిపింది. ఈ తరుణంలోనే.. తనపై మూడు సార్లు లైంగిక దాడిచేశారని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆరోపణలు చేసింది. ఇలాంటి వాళ్ళన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది బాధితురాలు. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ను ఎలాంటి కార్యక్రమాలకు పిలువకండని కోరింది.




మరింత సమాచారం తెలుసుకోండి: