* వరద బాధితులకు అండగా టాలీవుడ్
* చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు అందరూ సహాయం
* అందరికంటే ఎక్కువగా సాయం చేసిన ప్రభాస్
* నిర్మాతలు, దర్శకుల సహాయం


ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. మొన్న శనివారం ప్రారంభమైన వర్షాలు... ఇవాల్టి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొడుతున్నాయి. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో... భారీగా వర్షాలు పడినప్పటికీ...  నష్టపోయింది విజయవాడ అలాగే ఖమ్మం జిల్లాలు.


 ఖమ్మం జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీ... దాని పైన ఉన్న  మున్నేరు వాగు  ఉదృతంగా ప్రవహించడంతో ఖమ్మం పట్టణంలోకి వరదలు వచ్చాయి. దీంతో చాలామంది తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో కుటుంబంలో దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు... తీవ్ర నష్టం జరిగింది. ఇటు విజయవాడలో కూడా అదే పరిస్థితి. 130 సంవత్సరాల తర్వాత విజయవాడ ను..  వరదలు ముంచేసాయని చెప్పవచ్చు.

 అయితే... వరద బీభత్సం సృష్టించిన నేపథ్యంలో... వెంటనే టాలీవుడ్ హీరోలు స్పందించారు. వరదల వల్ల నష్టపోయిన వారికి... అండగా నిలిచారు మన టాలీవుడ్ హీరోలు. మొట్టమొదటిగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించి... రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళం ప్రకటించి మంచి మనసు చాటుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మొదలు పెట్టిన తర్వాత... చిన్న పెద్ద అనే తేడా లేకుండా... టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ హీరోలు దాదాపుగా విరాళాలు ప్రకటించారు.

 రెబల్ స్టార్ ప్రభాస్ అందరికంటే ఎక్కువగా... రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఆయన రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లు ప్రకటించడం జరిగింది. ప్రభాస్ తో పాటు మహేష్ బాబు, చిరంజీవి కుటుంబం, అటు అక్కినేని ఫ్యామిలీ కూడా... వరద బాధితులకు విరాళాలు ప్రకటించాయి. నిర్మాతలు అలాగే దర్శకులు కూడా... వరద బాధితులకు అండగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: