ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న అధికార వైసిపి ఆంధ్రప్రదేశ్లో ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసింది. ఒకే ఒక్క ఓటమి వైసిపి కూసాలు కదిలిపోయేలా చేసింది. ఒక ఓటమి దెబ్బతో వైసిపి పునాదులు కదిలిపోతున్నాయి ... ఎన్నికలలో ఓటమి తర్వాత కనీసం మూడు నెలలు కూడా కాలేదు ... పార్టీ నుంచి పలువురు కీలక నేత‌లు పార్టీ మారిపోతున్నారు.. మాజీ మంత్రులు .. మాజీ ఎమ్మెల్యేలు ... జిల్లా పార్టీ అధ్యక్షులు చివరకు రాజ్యసభ సభ్యులు కూడా వైసిపిని వెళుతున్నారు. అవసరం అయితే తమ పదవులకు కూడా రాజీనామాలు చేసేస్తున్నారు. ఊహించిన విధంగా బలహీనపడుతున్న వైసీపీకి బలం పెంచాలంటూ పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ళ మోహన సాయి దత్‌ను జగన్ నియమించారు.


ఈ నియామకంపై వైసీపీలో ఎవరు ? ఈయన అంటూ ఒకేసారి పెద్ద ఇతని చర్చ మొదలైంది. వైసిపి అధికారం కోల్పోయాక కీలక నేతలు ద్వితీయ శ్రేణి నాయకులు వరుసగా వైసిపిని వీడి వెళ్లిపోతున్నారు. పార్టీని వీడవద్దు ... మళ్లీ మనం అధికారంలోకి వస్తాం అంటూ బుజ్జగిస్తున్న ఫలితం ఉండటం లేదు. ఈ క్రమంలోనే కొందరు కీలక నేతలు కూడా త్వరలోనే వైసిపిని వీడి బయటకు వెళ్లిపోతారంటూ ? ప్రచారం జరుగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా వైసిపి కోసం రాజకీయ వ్యూహా కర్తను నియమించుకోవాలని ఆలోచనతో జగన్ ఉన్నారని ప్రచారం జరిగింది. కర్ణాటక - తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యూహాకర్త వ్యవహరించిన సునీల్ క‌నుగోలు టీమ్ కు చెందిన వ్య‌క్తుల‌తో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని వాదనలు వినిపించాయి.


వీటిపై చర్చ‌ జరుగుతుండగానే పార్టీ నిర్మాణం కోసం వాళ్ళ మోహన్ సాయి దత్‌ను జగన్ నియమించారు. ఈ సాయి దత్‌ ఎవరో కాదు.. మొన్న లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో బిజెపికి సేవలందించారు. రాష్ట్రంలో అధికార పార్టీతో సమానంగా ఎనిమిది సీట్లు బిజెపికి దక్కిన ఆయన పేరు పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు అలాంటి వ్యక్తినే జగన్ తన పార్టీ కోసం నియమించుకోవడం హాట్‌ టాపిక్ గా మారింది. దేశంలో పేరు మోసిన‌ వ్యూహకర్తలంద‌రూ నో చెప్పడంతోనే చివరకు సాయి దత్‌ను పార్టీ నిర్మాణం కోసం జగన్ తెచ్చి పెట్టుకున్నారు అన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: