తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో చాలా స్వేచ్ఛ ఎక్కువ ఉన్న నేపథ్యంలో... ఆ పార్టీలో ఉన్న నేతలు అందరూ...  ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి తప్పు చేసిన కూడా... ఆ పార్టీలో ఉన్న చిన్న లీడర్ కూడా ప్రశ్నించే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇదే అదునుగా చూసుకొని.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి... ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తూ ఉంటారు.

 ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం చాలా గమనించాం.  అయితే లేటెస్ట్ గా తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా మహేష్ గౌడ్ నియామకమైన నేపథ్యంలో... హాట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. తనకు పిసిసి వస్తుందని అభిప్రాయపడ్డ జగ్గారెడ్డి.. మహేష్ గౌడ్ కు రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. మొన్నటి వరకు రెడ్డిలకు ఇచ్చిన పదవిని ఇప్పుడు బీసీలకు ఇవ్వాలని అధిష్టానం అనుకుందని తెలిపారు.

 ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యం లో....పిసిసి అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ఇచ్చినట్లు తెలిపారు. అదే సమయంలో తన ఓటమిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు  జగ్గా రెడ్డి. సంగారెడ్డి నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా గెలవాలంటే ఏకంగా 50 కోట్లు కావాలని... అంత మేరకు ఖర్చు చేస్తేనే...  ఎమ్మెల్యేగా గెలవగలం అంటూ జగ్గారెడ్డి హాట్ కామెం ట్ చేయడం జరిగింది.

 అదే పటాన్చెరువు ఎమ్మెల్యేగా విజయం సాధించాలంటే 100 కోట్లు కచ్చితంగా కావాల్సిందేనని... లేకపోతే గెలవడం కష్టం అన్నారు జగ్గారెడ్డి. ప్రస్తుతం రాజకీయాలని... డబ్బు చుట్టే తిరుగుతున్నాయని... డబ్బు లేకపోతే రాజకీయాలు చేయడం కష్టమన్నారు. ఇది ఇలా ఉండగా మొన్నటి ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయిన సంగతి తెలిసిందే.  టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో సంగారెడ్డి  నియోజకవర్గంలో దారుణంగా ఓడిపోయారు జగ్గారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: