ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు వినాయక చవితి పండుగ పంచాయతీ నెలకొంది. వినాయక చవితి సందర్భంగా చాలా మంది యువకులు పెద్దపెద్ద గణపతులను పెట్టి పూజలు చేస్తారు. అయితే పెద్ద గణపతి పెట్టే వారిపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గణపతి హైట్ పెరిగిన కొద్దీ ఫైన్ కట్టాల్సి ఉంటుందని.. ఏపీ హోం మంత్రి అనిత గారు.. హెచ్చరికలు జారీ చేశారు. మండపాల వద్ద సౌండ్ సిస్టం పెడితే రోజుకు వంద రూపాయలు ఫైన్ కట్టాలని కూడా ఆదేశాలు ఇచ్చారు.


అంతేకాదు విగ్రహం సైజును బట్టి 300 రూపాయలు, 700 రూపాయలు చాలాన్లు కట్టాల్సి ఉంటుందని కూడా..వార్నింగ్ ఇచ్చారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత. అయితే విగ్రహాలపై ఆశలు విధించిన... ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీ హోం మంత్రి  వంగలపూడి అనిత పై టాలీవుడ్ హీరోయిన్, బిజెపి నేత మాధవి లత ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.


అనిత అక్క ఏంది నీ తిక్క..  అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసి మరి అనిత పై రెచ్చిపోయారు టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత. నిత్యం సోషల్ మీడియాలో ఉండే మాధవి లత... హిందుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా సంఘటనలు జరిగితే ఖచ్చితంగా స్పందిస్తారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. ఆంధ్ర హిందూ బంధువులు ముఖ్యంగా వినాయక భక్తులు... నువ్వు ఆడుకుంటే బిక్షం వేస్తారని చురకలాంటించారు. కానీ ఫైన్లు మాత్రం వేయకని మండిపడ్డారు.


ప్రభుత్వ పెద్దలు ఎప్పుడు కూడా...హిందూ బంధువుల దగ్గర... చిల్లర ఏరుకోవడమేనా...? ఇక మీకేం పని  లేదా? ఓ రేంజ్ లో రఫ్ ఆడించారు మాధవి లత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని... అలా చేసిన నిధులకు ఉరిశిక్ష వేయలేదని నిలదీశారు.  కానీ హిందూ పండగలు రాగానే... డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహించారు.  హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేసి లాయర్ల కోసం ఖర్చు పెడతారా? అంటూ మండిపడ్డారు. కాగా తెలుగుదేశం కూటమిలో బిజెపి కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరి దీనిపై ఏపీ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: