* విజయవాడకు భారీగా వరదలు
* 48 మంది వరదలకు మృతి
* బుడమేరుతో... ప్రమాదంలో పడ్డ విజయవాడ
* పది రోజులుగా కరెంటు లేని పరిస్థితి
* కోట్లలో పంట అలాగే ఆస్తి నష్టం

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత శనివారం నుంచి... భయంకరంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో విజయవాడ మహానగరం, అటు తెలంగాణలోని ఖమ్మం ప్రాంతంలో వరదలు.. ప్రమాదకరంగా వచ్చాయి. పొద్దున లేవగానే ఇండ్లన్నీ  నీటిలో మునిగిపోయాయి. ఎక్కడి జనాలు అక్కడే చిక్కుకుపోయారు. పశువులు అలాగే జంతువులు వరదలకు కొట్టుకుపోయాయి. రైతుల బాధలు ఇక చెప్పలేనివి.

 

వేసిన పంట మొత్తం నీటిలో మునిగిపోయింది. గత పది రోజులుగా విజయవాడ మహానగరంలో..  జనాలు పడే అవస్థలు ఎవరికి రావద్దని అందరం కోరుకోవాలి. అంతటి నరకాన్ని విజయవాడ వాసులు అనుభవిస్తున్నారు. దీనంతటికీ కారణం... బుడమేరు అనే వాగు. ఈ బుడమేరు వాగుకు గండ్లు పడడంతో... విజయవాడ కొంప మునిగింది. దాదాపు బుడమేరు వాగు కు మూడు గంటలు పడ్డాయని అధికారులు గుర్తించారు.

 

అయితే అధికారులు అప్రమత్తంగా లేకపోవడంతో... వరద మొత్తం విజయవాడ నగరంలోకి వచ్చింది. దీంతో కృష్ణ నది పరివాహక ప్రాంతాలు, పలు కాలనీలు మొత్తం మునిగిపోయాయి. ఒక్కో ఇంట్లో దాదాపు పది లక్షల  ఆస్తి నష్టం జరిగిందని చెప్పవచ్చు. దీంతో జనాలు లబోదిబోమంటున్నారు. అయితే బుడమేరు వాగు గండ్లను పూడ్చేందుకు ఇప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది.

 కానీ అక్కడ పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదని సమాచారం. ఆర్మీ రంగంలోకి దిగినా కూడా.. పరిస్థితి మారడం లేదని తెలుస్తోంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం...  విజయవాడ వరద బాధితులను మాత్రం చాలావరకు కాపాడాలని చెప్పవచ్చు. ఆయన ఇల్లు మునిగినా కూడా... వరద బాధితుల కోసం 24 గంటలు పనిచేస్తున్నారు. గత పది రోజులుగా చంద్రబాబు నాయుడు అసలు నిద్ర పోలేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: